పదవ తరగతి మండల టాపర్ కి ఘనంగా సన్మానం కమ్మర్ పల్లి: మండలం ఉప్లూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరిక్ష ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన సిరిగిరి షాలిని (568), కృష్ణా శ్రీ (517), నవీన (515) మార్కులు సాధించిన విద్యార్థులకు ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, మండల విద్యాధికారి ఆంద్రయ్య, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బస వేణుగోపాల్ యాదవ్ లు ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్లూర్ గ్రామానికి చెందిన సిరిగిరి షాలిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప్లూర్ లో చదివి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 568 మార్కులు సాధించి కమ్మర్ పల్లి మండల టాపర్ గా నిలవడం చాలా గర్వకారణం అని అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పేదరికాన్ని జయించిన సరస్వతి దేవి పుత్రిక విద్య కుసుమం షాలిని అని, అలాగే రానున్న రోజుల్లో ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, పాఠశాలలో మంచి విద్యానందించి మంచి ఫలితాలు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయులు రాజన్న సర్ కి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడిసి క్యాషియర్ సదానంద, సల్మాన్, సదుల్ల, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పదవ తరగతి మండల టాపర్ కి ఘనంగా సన్మానం కమ్మర్ పల్లి: మండలం ఉప్లూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరిక్ష ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన సిరిగిరి షాలిని (568), కృష్ణా శ్రీ (517), నవీన (515) మార్కులు సాధించిన విద్యార్థులకు ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, మండల విద్యాధికారి ఆంద్రయ్య, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బస వేణుగోపాల్ యాదవ్ లు ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్లూర్ గ్రామానికి చెందిన సిరిగిరి షాలిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప్లూర్ లో చదివి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 568 మార్కులు సాధించి కమ్మర్ పల్లి మండల టాపర్ గా నిలవడం చాలా గర్వకారణం అని అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పేదరికాన్ని జయించిన సరస్వతి దేవి పుత్రిక విద్య కుసుమం షాలిని అని, అలాగే రానున్న రోజుల్లో ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, పాఠశాలలో మంచి విద్యానందించి మంచి ఫలితాలు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయులు రాజన్న సర్ కి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడిసి క్యాషియర్ సదానంద, సల్మాన్, సదుల్ల, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- అన్నదాత ఆవేదన...1
- జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1