Shuru
Apke Nagar Ki App…
పరీక్షల ప్రభావం… పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల రద్దీ తగ్గింపు ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.
Nava surya
పరీక్షల ప్రభావం… పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల రద్దీ తగ్గింపు ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరుకానున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల సమయంలో అరకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.1
- Post by Shyam1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- ఒరిస్సా సరిహద్దు నుంచి వచ్చిన మరో ఏనుగు1
- రేడియేషన్ నియంత్రణ గ్రహణ సమయంలో భూమిపై పడే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుండి ఆహార పదార్థాలను రక్షించడానికి గరికను ఉపయోగిస్తారు. పవిత్రత మరియు రక్షణ: గరిక (దర్భ) ను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అపవిత్రతను లేదా గ్రహణ సమయంలో సంభవించే ప్రతికూల శక్తులను (Negative Energy) నివారిస్తుందని నమ్ముతారు.సహజ నిల్వ కారకం (Natural Preservative): గరిక యాంటీ రేడియేషన్ మరియు బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలను కలిగి ఉంది. ఇది పెరుగు, పాలు, వండిన ఆహార పదార్థాలు, ఊరగాయలు పాడవకుండా లేదా బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. శాస్త్రీయ కారణం: పరిశోధనల ప్రకారం, దర్భ గడ్డి రేడియేషన్ను, ముఖ్యంగా ఎక్స్-రేలను కూడా కొంతవరకు శోషించుకుంటుంది (absorb). అందుకే, గ్రహణ సమయంలో వండిన పదార్థాలు, నీటి పాత్రలు, నిల్వ ఉంచిన ధాన్యంపై ఈ గడ్డిని వేస్తారు. ప్రధాన ఉపయోగాలు ఆహార రక్షణ ఆహార పదార్థాలపై గరికను వేయడం వల్ల ఆహారం నిల్వ ఉంటుంది, విషతుల్యం కాదు. నీటి శుద్ధి: మంచి నీటి పాత్రలలో గరికను ఉంచడం వల్ల నీరు శుద్ధి అవుతుంది.గ్రహణ సమయంలో చేసే దానధర్మాలు, జపాలు, తర్పణాల సమయంలో దర్భల రంగును (పవిత్రి) ధరించడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ సమయంలో గరికను వాడటం అనేది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక పవిత్రమైన మరియు శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ గడ్డిని తీసివేసి, స్నానం ఆచరించడం మంచిది.1
- మార్చి 3 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ గుడ్డిమీదపేట, చొక్కరవానిపేట మరియు సూరాడవాని పేట సమీపంలో సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు తన సొంత నిధులతో యువకులు ఆడుకునేందుకు క్రికెట్ మైదానాన్నిఏర్పాటుచేసిమంగళవారం ఘనంగాప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత యువకుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని మరింత సానపెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా పంచాయతీలో రెండు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, క్రీడాకారులకు అవసరమైన సహాయం తన వంతుగా ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. మైదానం ఏర్పాటు చేసిన దాసురాజుకు పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.4
- ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.1