Shuru
Apke Nagar Ki App…
Naresh Koppula
More news from తెలంగాణ and nearby areas
- Post by Naresh Koppula5
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by వేముల నాగరాజు4
- AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.1
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1
- Post by Anji Raju1
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- Post by Naresh Koppula4