గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర.మూడు రోజుల పాటు కన్నులపండువగా సాగనున్న ‘చిట్టి పండుగ’ వేడుకలు.భారీగా తరలివచ్చిన బుర్క వంశీయులు.. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్న ఆదివాసీలు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర.మూడు రోజుల పాటు కన్నులపండువగా సాగనున్న ‘చిట్టి పండుగ’ వేడుకలు.భారీగా తరలివచ్చిన బుర్క వంశీయులు.. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్న ఆదివాసీలు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.1
- వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.5
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by Naresh Koppula5
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. , సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.2
- చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష.... చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరం లో ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధి లోని నీటి వనరు లైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ముందుగా అంచనా, ప్రణాళిక – నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ,మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్సెప్షన్,డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్వర్క్, ఎస్ టి పి ల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో కుడా సి పి ఓ అజిత్ రెడ్డి అదనపు కలెక్టర్ రవి బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ ఇరిగేషన్, కుడా , బల్దియా ఈ ఈ లు కిరణ్ కుమార్ భీమ్ రావు మహేందర్ సంతోష్ బాబు ఇరిగేషన్ డి ఈ హర్షవర్థన్ ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్ పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.4
- గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శనివారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతిగృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 92 ఇన్స్టిట్యూషన్లలో 3628 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1689 బాలికలు 1939 కలిపి 3628 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.1