Shuru
Apke Nagar Ki App…
కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షాలు., జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలో అన్ని జలమయం అయ్యాయి ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి. పలుచోట్ల కాలనీవాసులు ఇండ్లనుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
Telangana reporter
కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షాలు., జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలో అన్ని జలమయం అయ్యాయి ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి. పలుచోట్ల కాలనీవాసులు ఇండ్లనుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- ఉధృతంగా ప్రవహిస్తున్న టేకుమట్ల కుందారం వాగు *రాకపోకలకు అంతరాయం, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు* ఉధృతంగా ప్రవహిస్తున్న టేకుమట్ల కుందారం వాగు *రాకపోకలకు అంతరాయం, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు* *జైపూర్:* జైపూర్ మండలం *కుందారం (టేకుమట్ల)* గ్రామం వద్ద వాగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు *ఉధృతంగా ప్రవహిస్తోంది*. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులో నీటి మట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. దీంతో కుందారం - టేకుమట్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగు వద్దకు ఎవరూ వెళ్లవద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా ప్రకటన చేశారు. రైతులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాగులో నీటి ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని, వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.1
- వేములవాడ 13వ వార్డు వరలక్ష్మి కాలనీ వాసుల సమస్యలు వర్షాల కారణంగా రహదారులు జలమయం – రాకపోకలకు తీవ్ర అంతరాయం వేములవాడ పట్టణంలోని 13వ వార్డు వరలక్ష్మి కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీ రహదారులు పూర్తిగా నీటమునిగాయి. రోడ్లపై వర్షపు నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు విద్యార్థుల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అత్యవసర అవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కాలనీలో నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించడంతో పాటు, శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి మరియు రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.3
- శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైభవంగా గోపూజోత్సవం గురు పౌర్ణమి ఉత్సవం కరీంనగర్ లోని కృష్ణానగర్ లోని శ్రీధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ని పురస్కరించుకొని 108 మంది దంపతుల చేత సామూహిక గోపూజోత్సవాన్ని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు జ్యోతిష్య -వాస్తు- ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు గోపూజ వైభవం నిర్వహించారు.. వ్యాసభగవానుడు లోకానికి 18 పురాణాలు, ఉప పురాణాలు, ఉపనిషత్తులు అందించి గురుస్థానాన్ని పొందాడని, ప్రతి వ్యక్తి తల్లే మొదటి గురువు అని, గోమాత తల్లి లాంటి క్షేమాన్ని అందిస్తుంది కాబట్టే దానిని గోమాత అన్నారని,... గోమాతను ఆరాధించిన వారికి తల్లిదండ్రుల సేవ చేసిన వారికి సకల దేవత అనుగ్రహం కలుగుతుందని.. రమణాచార్యులు తెలియపరచారు.. ఈ కార్యక్రమంలో పండితులు నమిలకొండ రమణాచార్యులు గుండ రాధాకృష్ణన్ గారు నారదాసు వసంతరావు గారు కాంగ్రెస్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు మొదలగు చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమానంతరం పండితులు తీర్థ ప్రసాదాన్ని అందించారు.. అన్నదానం కూడా జరిగింది.. వర్షం ఉన్నప్పటికీపలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు. భక్తులందరికీ ఉచిత గోవులను పూజా సామాగ్రిని ఉచితంగా అందించారు...1
- SIR ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే సమర్పించండి – కామన్ అత్యవసర విజ్ఞప్తి కరీంనగర్ అలైడ్ ముస్లిం అసోసియేషన్స్ అండ్ ఎన్జీఓస్ నెట్వర్క్ (కామన్ ) కరీంనగర్ అలైడ్ ముస్లిం అసోసియేషన్స్ అండ్ ఎన్జీఓస్ నెట్వర్క్ (కామన్ ) ఆధ్వర్యంలోని ఆడాలహా – ఆక్సిస్ to జస్టిస్ నెట్వర్క్ , దారుల్ ఖైర్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంజేఏసీ ) సంయుక్తంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి చేస్తున్నాయి. SIR-2026 గడువుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, అర్హులైన ఓటర్లు తమ పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) కు సమర్పించాలని కోరుతున్నాము. చివరి రోజుల్లో భారీ సంఖ్యలో ఫారాలు సమర్పించబడితే, వాటిని డిజిటలైజ్ చేసి పోర్టల్లో నమోదు చేయాల్సిన బాధ్యత BLOలపై ఉంటుంది. అందువల్ల ముందుగానే ఫారాలు సమర్పించడం ద్వారా BLOల పనిభారం తగ్గడమే కాకుండా, మీ ఓటు హక్కు రక్షణకు కూడా దోహదపడుతుంది. 2002 SIR లెగసీ వివరాలు అందుబాటులో లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారం సమర్పించడాన్ని వాయిదా వేయవద్దు. అలాంటి వారు ఎన్యూమరేషన్ ఫారంలోని మూడవ కాలమ్ (వ్యక్తిగత వివరాలు) మాత్రమే సరైన సమాచారంతో నింపి వెంటనే BLOకు సమర్పించాలి. తరువాత మీకు విచారణ (హియరింగ్ ) తేదీ మరియు సమయం కేటాయించబడుతుంది. ఆ సమయంలో లేదా అంతకుముందు 2002 లెగసీ వివరాలు లభిస్తే వాటిని సమర్పించవచ్చు. కాబట్టి లెగసీ వివరాల కోసం ఎదురుచూడకుండా వెంటనే ఫారం సమర్పించండి. అలాగే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన "ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్"ను వెంటనే పొందాలని కామన్ విజ్ఞప్తి చేస్తోంది. SIR-2026లో ఆమోదయోగ్యమైన పత్రాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఒకటి కావున, ఇది విచారణ సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంది. కామన్ ప్రజలకు విజ్ఞప్తి ఎన్యూమరేషన్ ఫారాన్ని చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే సమర్పించండి. 2002 లెగసీ వివరాలు లేకపోయినా వ్యక్తిగత వివరాలు నింపి ఫారాన్ని సమర్పించండి. BLO నుండి తప్పనిసరిగా రసీదు (అక్నౌలెడ్జిమెంట్ ) తీసుకొని భద్రపరచుకోండి. రేషన్ కార్డు ఉన్నవారు వెంటనే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పొందండి. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మరియు వాలంటీర్లు ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి, గడువులోపు ఫారాల సమర్పణకు సహకరించాలని కామన్ కోరుతోంది జారీ చేసినవారు:1
- 38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి, 1 గంజాయి మొక్క దగ్ధం - కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను (బుధవారం) ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమీషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.3
- కరీంనగర్ లో 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు... నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిని, ఒక గంజాయి మొక్కను పోలీసులు దగ్ధం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఒక గంజాయి మొక్కను సైతం దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- వర్షా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజార్ ప్రాంతంలోని నీటి నిల్వలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పరిశీలించారు.1
- 38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి, 1 గంజాయి మొక్క దగ్ధం - కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన *38 కేసుల్లో* స్వాధీనం చేసుకున్న *63 కిలోల 621 గ్రాముల గంజాయి* మరియు *1 గంజాయి మొక్కను* ఈరోజు (బుధవారం) ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమీషనర్ గారి సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.1