Shuru
Apke Nagar Ki App…
గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
P.G. Murthy
గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్కు అంతరాయం జన్నారం–మంచిర్యాల్ ప్రధాన రహదారిలో దొంగపెళ్లి సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును వెంటనే తొలగించి రాకపోకలు సజావుగా సాగేందుకు అటవీ శాఖ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.2
- ఉధృతంగా ప్రవహిస్తున్న టేకుమట్ల కుందారం వాగు *రాకపోకలకు అంతరాయం, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు* ఉధృతంగా ప్రవహిస్తున్న టేకుమట్ల కుందారం వాగు *రాకపోకలకు అంతరాయం, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు* *జైపూర్:* జైపూర్ మండలం *కుందారం (టేకుమట్ల)* గ్రామం వద్ద వాగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు *ఉధృతంగా ప్రవహిస్తోంది*. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులో నీటి మట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. దీంతో కుందారం - టేకుమట్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగు వద్దకు ఎవరూ వెళ్లవద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా ప్రకటన చేశారు. రైతులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాగులో నీటి ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని, వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.1
- కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ వర్షాలు., జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలో అన్ని జలమయం అయ్యాయి ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లిపోతున్నాయి. పలుచోట్ల కాలనీవాసులు ఇండ్లనుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.1
- మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గురువారం సిరిసిల్ల, వేములవాడ పర్యటన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా & BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. *30.07.2026 గురువారం కార్యక్రమ వివరాలు:* *ఉదయం 6.30 గం:* హైదరాబాద్ నుండి బయలుదేరడం *ఉదయం 9.00 గం:* వేములవాడ చేరుకొని శ్రీ రాజ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం. అనంతరం గుడి చెరువు ట్యాంక్ బండ్ పార్క్ ను ప్రారంభించడం, తిప్పాపూర్ బస్ స్టాండ్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం *ఉదయం 10.30 గం:* సిరిసిల్ల చేరుకొని రాగుడు బైపాస్ జంక్షన్, రాగుడు జంక్షన్ వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించడం. IDOC లో El Nino యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశంలో పాల్గొనడం *మధ్యాహ్నం 12.30 గం:* సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ఈ మేరకు వ్యవసాయ శాఖ OSD V. శ్రీధర్ టూర్ ప్రోగ్రాం నెం. 64/M/2026 ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.1
- నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామం లో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెక్ డ్యామ్ నిండి నీరు పైనుండి ప్రవహిస్తుంది1
- గూడెం దేవాలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు, ప్రత్యేక పూజలు దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. గురుపౌర్ణమి కావడంతో బుధవారం దేవాలయంలోని స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించారు. దేవాలయంలోని యజ్ఞశాలలో 57 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయని దేవాలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. దీంతో దేవాలయం పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- *తీవ్రమైన వర్షం ప్రభావానికి జగిత్యాల రూరల్ మండలంలో పొంగుతున్న గుండ్లపేట అనంతారం వాగు1
- వర్షా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజార్ ప్రాంతంలోని నీటి నిల్వలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పరిశీలించారు.1
- రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.1