సి హెచ్ సి చింతూరు ఎస్ ఎన్ సి యు నవజాత శిశు కేంద్రం లో అత్యల్ప బరువుతో పుట్టిన శిశువు కు విజయవంతంగా చికిత్స. చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో అత్యల్ప బరువుతో (1 కిలో కంటే తక్కువ) పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ శిశువు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పొడియా మండలం, పుట్టంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి మడకం కాంతి మరియు శ్రీ మల్లా దంపతులకు పూర్వకాల ప్రసవం (Premature Delivery) ద్వారా కుంట CHC లో జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు అత్యంత సీరియస్ పరిస్థితిలో ఉండటంతో కుంట ప్రభుత్వ ఆసుపత్రి నుండి చింతూరు ఆసుపత్రి కి రిఫర్ చేశారు చింతూరు SNCUలో చేర్పించారు. డాక్టర్ బి. మహేష్, పిల్లల వైద్య నిపుణుడు (పెడియాట్రిషన్) ఆధ్వర్యంలో, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం.వి. కోటిరెడ్డి పర్యవేక్షణలో శిశువుకు 80 రోజుల పాటు నిరంతర వైద్య చికిత్స మరియు ప్రత్యేక సంరక్షణ అందించారు. శిశువు బరువు 1 కిలో కంటే తక్కువ నుండి 1.5 కిలోల వరకు పెరిగి ఆరోగ్యంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది 24 గంటలు శ్రద్ధగా సేవలు అందిస్తూ, నవజాత శిశు సంరక్షణ విధానాలను కచ్చితంగా పాటించడం ద్వారా శిశువు కోలుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి చికిత్సను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందాలంటే సుమారు రూ. 5 నుండి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే CHC చింతూరులో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం ప్రభుత్వ వైద్య సేవల ప్రతిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం శిశువు సురక్షితంగా, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయబడింది. ఇది తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో డా ఎం వి కోటిరెడ్డి సూపరింటెండెంట్, డా బి మహేష్ పీడియాట్రీషన్ , హెడ్ నర్స్ కుమారి, సిబ్బంది సుహాసిని, సౌందర్య, దుర్గా, స్వాతీ, శిరీష పాల్గొన్నారు.
సి హెచ్ సి చింతూరు ఎస్ ఎన్ సి యు నవజాత శిశు కేంద్రం లో అత్యల్ప బరువుతో పుట్టిన శిశువు కు విజయవంతంగా చికిత్స. చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో అత్యల్ప బరువుతో (1 కిలో కంటే తక్కువ) పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ శిశువు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పొడియా మండలం, పుట్టంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి మడకం కాంతి మరియు శ్రీ మల్లా దంపతులకు పూర్వకాల ప్రసవం (Premature Delivery) ద్వారా కుంట CHC లో జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు అత్యంత సీరియస్ పరిస్థితిలో ఉండటంతో కుంట ప్రభుత్వ ఆసుపత్రి నుండి చింతూరు ఆసుపత్రి కి రిఫర్ చేశారు చింతూరు SNCUలో చేర్పించారు. డాక్టర్ బి. మహేష్, పిల్లల వైద్య నిపుణుడు (పెడియాట్రిషన్) ఆధ్వర్యంలో, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం.వి. కోటిరెడ్డి
పర్యవేక్షణలో శిశువుకు 80 రోజుల పాటు నిరంతర వైద్య చికిత్స మరియు ప్రత్యేక సంరక్షణ అందించారు. శిశువు బరువు 1 కిలో కంటే తక్కువ నుండి 1.5 కిలోల వరకు పెరిగి ఆరోగ్యంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది 24 గంటలు శ్రద్ధగా సేవలు అందిస్తూ, నవజాత శిశు సంరక్షణ విధానాలను కచ్చితంగా పాటించడం ద్వారా శిశువు కోలుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి చికిత్సను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందాలంటే సుమారు రూ. 5 నుండి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే CHC చింతూరులో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం ప్రభుత్వ వైద్య సేవల ప్రతిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం శిశువు సురక్షితంగా, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయబడింది. ఇది తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో డా ఎం వి కోటిరెడ్డి సూపరింటెండెంట్, డా బి మహేష్ పీడియాట్రీషన్ , హెడ్ నర్స్ కుమారి, సిబ్బంది సుహాసిని, సౌందర్య, దుర్గా, స్వాతీ, శిరీష పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- Post by Shyam1
- .పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్గఢ్కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి1
- 🙏😭1
- 🙏😭1
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- Post by Ramprasad islavath1