logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ.. మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

1 hr ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ.. మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గిరిజనుల సంక్షేమం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, గృహ వసతి, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు గిరిజన యువత ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధితో స్వయం సాధికారత సాధించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, ఆగస్టు 09: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆటలు, పాటలు, పుస్తక పఠనం, లైఫ్‌ స్కిల్స్‌ వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జిల్లాలోని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, డెప్యుటేషన్ల రద్దు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాలల వారీగా గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రాధాన్యత ఇచ్చామని, అనేక చోట్ల పనులు పూర్తయ్యాయని లేదా తుది దశలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వైపు దృష్టి మళ్లించకుండా విద్య, ఉద్యోగం, స్వయం సాధికారతపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటికి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సుమారు 40 గ్రామాలను గుర్తించి, నీటి ఎద్దడి నివారణ పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్.కె. తండా, సుగాలి మెట్ట తదితర ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన భవన్‌కు స్థల పరిశీలన జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి లభ్యత పరిమితంగా ఉండటం, అందుబాటులో ఉన్న కొన్ని భూములు నీటి వనరులకు సంబంధించినవి కావడంతో న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల నంద్యాల రూరల్, పాణ్యం రూరల్, మహానంది తదితర పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని స్వయంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి నిబంధనల మేరకు తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు గిరిజన మహిళలు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద వెదురుతో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి నేరుగా విక్రయించడంతో పాటు బల్క్‌ ఆర్డర్లు పొందేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. చెంచు, పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగల (PVTG) కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మెరుగైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందుతుందని, మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు రీ-సర్వే, డాటెడ్ ల్యాండ్స్‌, 22-ఏ తదితర భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ప్రతి చిన్న సమస్య కోసం జిల్లా స్థాయి అధికారుల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆర్‌డీఓ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ROFR పట్టాలు, పాస్‌బుక్‌లకు సంబంధించి వారసులకు ఎదురవుతున్న సమస్యలను ఐటీడీఏ ద్వారా పరిష్కరించి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెంచు లక్ష్మిగూడెం వద్ద మిగిలిన 17 ఎకరాల భూమికి ROFR పట్టాలు, బోర్లు మంజూరు చేసి ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించినట్లు వివరించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అటవీ సంరక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రజలు, అధికారులు సమష్టిగా పాటించాలని సూచించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, హిల్‌ పొరంబోకు భూములను పరిశీలించి అవసరమైన చోట్ల స్థానిక సంస్థలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో వాగులు దాటాల్సి వస్తున్న ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డిడి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గిరిజనుల సంక్షేమం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, గృహ వసతి, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు
గిరిజన యువత ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధితో స్వయం సాధికారత సాధించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, ఆగస్టు 09: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత
గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆటలు, పాటలు, పుస్తక పఠనం, లైఫ్‌ స్కిల్స్‌ వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
జిల్లాలోని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, డెప్యుటేషన్ల రద్దు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాలల వారీగా గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రాధాన్యత ఇచ్చామని, అనేక చోట్ల పనులు పూర్తయ్యాయని లేదా తుది దశలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వైపు దృష్టి మళ్లించకుండా విద్య, ఉద్యోగం, స్వయం సాధికారతపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటికి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సుమారు 40 గ్రామాలను గుర్తించి, నీటి ఎద్దడి నివారణ పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్.కె. తండా, సుగాలి మెట్ట తదితర ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
గిరిజన భవన్‌కు స్థల పరిశీలన
జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి లభ్యత పరిమితంగా ఉండటం, అందుబాటులో ఉన్న కొన్ని భూములు నీటి వనరులకు సంబంధించినవి కావడంతో న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల నంద్యాల రూరల్, పాణ్యం రూరల్, మహానంది తదితర పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని స్వయంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి నిబంధనల మేరకు తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు
గిరిజన మహిళలు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద వెదురుతో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి నేరుగా విక్రయించడంతో పాటు బల్క్‌ ఆర్డర్లు పొందేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
చెంచు, పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం
ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగల (PVTG) కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మెరుగైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందుతుందని, మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
రీ-సర్వే, డాటెడ్ ల్యాండ్స్‌, 22-ఏ తదితర భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ప్రతి చిన్న సమస్య కోసం జిల్లా స్థాయి అధికారుల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆర్‌డీఓ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ROFR పట్టాలు, పాస్‌బుక్‌లకు సంబంధించి వారసులకు ఎదురవుతున్న సమస్యలను ఐటీడీఏ ద్వారా పరిష్కరించి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెంచు లక్ష్మిగూడెం వద్ద మిగిలిన 17 ఎకరాల భూమికి ROFR పట్టాలు, బోర్లు మంజూరు చేసి ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించినట్లు వివరించారు.
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అటవీ సంరక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రజలు, అధికారులు సమష్టిగా పాటించాలని సూచించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, హిల్‌ పొరంబోకు భూములను పరిశీలించి అవసరమైన చోట్ల స్థానిక సంస్థలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో వాగులు దాటాల్సి వస్తున్న ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డిడి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *డీ యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *జగన్ రెడ్డి కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదు* *ప్రజలను మభ్యపెట్టాలని దీక్షలతో ఇబ్బంది పెట్టాలని చుస్తే టీడీపీ పార్టీ సహించదు* ఎమ్మిగనూరు నియోజకవర్గం లో డీ యస్ సి లో అవకతవకలు జరిగాయాని వైసీపీ చేస్తున్న దొంగ దీక్షలు మానుకోవాలని ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి విజయలక్ష్మి గారు హితావు పలికారు. ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు సోమప్ప సర్కిల్ సాక్షిగా బ్యానర్ చూపిస్తూ సవాల్ విసిరారు.గత వైసీపీ హయాంలో మెగా డీ యస్ సి హామీ నీ మరిచి డీ యస్ సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ రెడ్డి ఈరోజు డీ యస్ సి గురించి మాట్లాడటం విడ్డురం అని తెలిపారు. మా లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ విసిరిన ఎందుకు జగన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దాదాపు రెండువందలకు పైగా కేసులు వేపించిన హైకోర్టు మోటిక్కయాలు వేసిన వైసీపీ కి సిగ్గు రాలేదని ఆమె ఏద్దేవా చేశారు.వైసీపీ దీక్షలలో ఒక్కరైనా అన్యాయం జరిగింది అనే డీ యస్ సి అభ్యర్తి ఉన్నారా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను దీక్షలలో కూర్చోబెట్టి పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన ర్యాలీ లు చేసిన కూటమి మాట ప్రకారం ప్రతీ యేటా మెగా డీ యస్ సి ఇస్తుంది నిరుద్యోగులు జీవితలలో వెలుగు నింపుతుందని ఆమె తెలిపారు. నిన్న డీ యస్ సి లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు పై నుండి వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు మీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని విజయలక్ష్మి హెచ్చరించారు.
    1
    యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి*
*డీ యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి*
*జగన్ రెడ్డి కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదు*
*ప్రజలను మభ్యపెట్టాలని దీక్షలతో ఇబ్బంది పెట్టాలని చుస్తే టీడీపీ పార్టీ సహించదు*
ఎమ్మిగనూరు నియోజకవర్గం లో డీ యస్ సి లో అవకతవకలు జరిగాయాని వైసీపీ చేస్తున్న దొంగ దీక్షలు మానుకోవాలని ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి విజయలక్ష్మి గారు హితావు పలికారు. ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు సోమప్ప సర్కిల్ సాక్షిగా బ్యానర్ చూపిస్తూ సవాల్ విసిరారు.గత వైసీపీ హయాంలో మెగా డీ యస్ సి హామీ నీ మరిచి డీ యస్ సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ రెడ్డి ఈరోజు డీ యస్ సి గురించి మాట్లాడటం విడ్డురం అని తెలిపారు. మా లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ విసిరిన ఎందుకు జగన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దాదాపు రెండువందలకు పైగా కేసులు వేపించిన హైకోర్టు మోటిక్కయాలు వేసిన వైసీపీ కి సిగ్గు రాలేదని ఆమె ఏద్దేవా చేశారు.వైసీపీ దీక్షలలో ఒక్కరైనా అన్యాయం జరిగింది అనే డీ యస్ సి అభ్యర్తి ఉన్నారా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను దీక్షలలో కూర్చోబెట్టి పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన ర్యాలీ లు చేసిన కూటమి మాట ప్రకారం ప్రతీ యేటా మెగా డీ యస్ సి ఇస్తుంది నిరుద్యోగులు జీవితలలో వెలుగు నింపుతుందని ఆమె తెలిపారు. నిన్న డీ యస్ సి లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు పై నుండి వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు మీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని విజయలక్ష్మి హెచ్చరించారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    5 hrs ago
  • ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...! బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మాకు న్యాయం జరగలేదు అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    1
    ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...!
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ  మాకు న్యాయం జరగలేదు అంటూ  గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు  గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న  నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. 5.5 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్‌లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.
    1
    కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం 
మార్కాపురం జిల్లా
కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.
5.5 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్‌లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.
    user_Munna
    Munna
    కనిగిరి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._* విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    1
    * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._*

విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కోడుమూరు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ భరో.. *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ బరో* కోడుమూరు : ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్షాల నాయకులు రాజు, శేషుకుమార్, గఫుర్ మియ్యా, మోహన్ లు మాట్లాడుతూ గత నెలలో విద్యార్ధి, యువత చేపట్టిన ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించ్చిందాన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత తో మోదీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలన్నారు. అమెరికతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దుచెయ్యాలని, 4 లేబర్ కొడ్లను,విబి జిరాంజీ చట్టాలను రద్దుచెయ్యాలని, అసంగటిత కార్మికులందరికి రు 31/వేలు వేతనం ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దూల్ల భాస్కర్, బుగిడే మాధవస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, రాము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాముడు, జి, రామాంజనేయులు, తిమ్మప్ప, ఢిల్లీ వెంకటేశ్వర్లు,బోయ రామాంజనేయులు, ఆటో యూనియన్ నాయకులు మధు, కాటన్న గారి రామకృష్ణ, హమాలీసంగం నాయకులు వెంకటస్వామి, బజారి, అనిల్, మధు, మణి, మహిళా సంఘం నాయకులు సులోచనమ్మ సీపీయం నాయకులు కామర్తి రాజు, ఈరన్న, లక్ష్మన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    కోడుమూరు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ భరో..
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ బరో* కోడుమూరు : ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్షాల నాయకులు రాజు, శేషుకుమార్, గఫుర్ మియ్యా, మోహన్ లు మాట్లాడుతూ గత నెలలో విద్యార్ధి, యువత చేపట్టిన ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించ్చిందాన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత తో మోదీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలన్నారు. అమెరికతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దుచెయ్యాలని, 4 లేబర్ కొడ్లను,విబి జిరాంజీ చట్టాలను రద్దుచెయ్యాలని, అసంగటిత కార్మికులందరికి రు 31/వేలు వేతనం ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దూల్ల భాస్కర్, బుగిడే మాధవస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, రాము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాముడు, జి, రామాంజనేయులు, తిమ్మప్ప, ఢిల్లీ వెంకటేశ్వర్లు,బోయ రామాంజనేయులు, ఆటో యూనియన్ నాయకులు మధు, కాటన్న గారి రామకృష్ణ, హమాలీసంగం నాయకులు వెంకటస్వామి, బజారి, అనిల్, మధు, మణి, మహిళా సంఘం నాయకులు సులోచనమ్మ సీపీయం నాయకులు కామర్తి రాజు, ఈరన్న, లక్ష్మన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    5 hrs ago
  • అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    3
    అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్

14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి..


ప్రెస్ నోట్
కడప జిల్లా:
కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి
అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు
మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.