Shuru
Apke Nagar Ki App…
భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి – వర్షాకాల ముంపు భయంతో ప్రజల్లో ఆందోళన, యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు గడువు ముగుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడంపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో చెరువు నిండిన పరిస్థితుల్లో కాపువాడ కాలనీకి నీట ముంపు ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అందువల్ల యుద్ధప్రతిపాదికన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
M D Azizuddin
భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి – వర్షాకాల ముంపు భయంతో ప్రజల్లో ఆందోళన, యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు గడువు ముగుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడంపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో చెరువు నిండిన పరిస్థితుల్లో కాపువాడ కాలనీకి నీట ముంపు ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అందువల్ల యుద్ధప్రతిపాదికన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.3
- బెజ్జంకి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరం ప్రారంభం బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ప్రత్యేక శిబిరాన్ని సోమవారం సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకుని శిబిరంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసం, గణిత శాస్త్ర మెలకువలు, నృత్యం, క్రీడలు, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ మాలోతు సంగీత తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, వార్డు సభ్యులు ఎలిగే సతీష్, తిప్పారపు మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.1