Shuru
Apke Nagar Ki App…
ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో జనగణన శిక్షణ కార్యక్రమం.. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమం ను ఆర్డిఓ వెంకట శివ పరిశీలించారు. జనగణన, హౌస్ లిస్టింగ్ కార్యకలాపాల ప్రాముఖ్యతను ఆర్డిఓ వివరించారు. ప్రతి కుటుంబం, వ్యక్తుల వివరాలు సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు రూపొందించేందుకు సహాయపడుతుందని తెలిపారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధానం వల్ల ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. నాగరాజు, డి ఎల్ డి ఓ అన్వర బేగం , అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సాహెబ్ పీర్ , ఎంపీడీవో శ్రీ నాగేంద్ర , ఫీల్డ్ ట్రైనర్ ఖాజా మొయినుద్దీన్ మరియు అస్లాం తదితర అధికారులు హాజరయ్యారు.
Naga kanth
ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో జనగణన శిక్షణ కార్యక్రమం.. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమం ను ఆర్డిఓ వెంకట శివ పరిశీలించారు. జనగణన, హౌస్ లిస్టింగ్ కార్యకలాపాల ప్రాముఖ్యతను ఆర్డిఓ వివరించారు. ప్రతి కుటుంబం, వ్యక్తుల వివరాలు సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు రూపొందించేందుకు సహాయపడుతుందని తెలిపారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే విధానం వల్ల ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. నాగరాజు, డి ఎల్ డి ఓ అన్వర బేగం , అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సాహెబ్ పీర్ , ఎంపీడీవో శ్రీ నాగేంద్ర , ఫీల్డ్ ట్రైనర్ ఖాజా మొయినుద్దీన్ మరియు అస్లాం తదితర అధికారులు హాజరయ్యారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- Hi1
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- ఎమ్మిగనూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్1
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1