logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

16 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
16 hrs ago

లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
    1
    గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన
జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక.. బాధితుని ఆందోళన యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన
    1
    *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక..  
బాధితుని ఆందోళన 


యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., 
ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • భారీ వర్షాలు – ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అప్రమత్తత సూచనలు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.ఆసిఫాబాద్‌లోని తుంపెల్లి వాగు, గుండి వాగులను పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వరద తగ్గిన తర్వాతనే ప్రజలను దాటేందుకు అనుమతించాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రత సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ వంతెనల వద్దకు వెళ్లకూడదు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు నిషేధం. వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ వంతెనల వద్ద పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. ప్రజలకు పోలీసు శాఖ సూచనలు: ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగవద్దు చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దు నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు పశువులను మేతకు తీసుకెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలకు దూరంగా ఉండి అధికారులకు సమాచారం ఇవ్వాలి వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు నీటి ప్రవాహాలు, విద్యుత్ తీగల పట్ల అప్రమత్తత అవసరం శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దు అత్యవసరం కాని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దు పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలను జిల్లా ప్రజలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
    3
    భారీ వర్షాలు – ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అప్రమత్తత సూచనలు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.ఆసిఫాబాద్‌లోని తుంపెల్లి వాగు, గుండి వాగులను పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వరద తగ్గిన తర్వాతనే ప్రజలను దాటేందుకు అనుమతించాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రత సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ వంతెనల వద్దకు వెళ్లకూడదు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు నిషేధం. వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ వంతెనల వద్ద పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.
ప్రజలకు పోలీసు శాఖ సూచనలు:
ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగవద్దు
చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దు
నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు
పశువులను మేతకు తీసుకెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి
విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలకు దూరంగా ఉండి అధికారులకు సమాచారం ఇవ్వాలి
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు నీటి ప్రవాహాలు, విద్యుత్ తీగల పట్ల అప్రమత్తత అవసరం
శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దు
అత్యవసరం కాని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు
వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దు
సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దు పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలను జిల్లా ప్రజలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు... మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    4
    వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం

లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు...

మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్‌ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Milk delivery service మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా! ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది. తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా! ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది. ..
    1
    తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా!

ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది.

తెలంగాణ నయాగారా.. చూడండి కనులారా!
ములుగు జిల్లాలోని వాజేడు మండలంంలో ఉన్న బొగత జలపాతం భారీ వర్షాలకు ఇలా పాలధారల్లాంటి జలాలతో కనువిందు చేస్తోంది.
..
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • భారీ వర్షాలపై వరద ప్రభావిత ప్రాంతంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పరిశీలన రామగుండం కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు ఏరియాలలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. రామగుండం వెలువల కర్మాగారం ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలోకి డ్రైనేజీ నీరు కాలువల ద్వారా గ్రామంలోకి చేరడంతో సిపి పరిశీలించారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    1
    భారీ వర్షాలపై వరద ప్రభావిత ప్రాంతంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పరిశీలన 
రామగుండం కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు ఏరియాలలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. రామగుండం వెలువల కర్మాగారం ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలోకి డ్రైనేజీ నీరు కాలువల ద్వారా గ్రామంలోకి చేరడంతో సిపి పరిశీలించారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులను నిర్వహించిన కౌన్సిలర్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ ఎగ్గడి జమున కుమార్ సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వార్డులోని పలు కాలనీలలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో సమస్య ఉన్న ప్రాంతాలలో జెసిబి సహాయంతో నీటిని తీసివేయించారు. కౌన్సిలర్ జమున కుమార్ను ప్రజలు అభినందించారు.
    1
    సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులను నిర్వహించిన కౌన్సిలర్
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ ఎగ్గడి జమున కుమార్ సొంత ఖర్చులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వార్డులోని పలు కాలనీలలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో సమస్య ఉన్న ప్రాంతాలలో జెసిబి సహాయంతో నీటిని తీసివేయించారు. కౌన్సిలర్ జమున కుమార్ను ప్రజలు అభినందించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    1
    లక్షెట్టిపేట, కరీంనగర్ ఎక్స్‌రోడ్ చెరువును తలపించిన రహదారి.. ట్రాఫిక్‌కు అంతరాయం
లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ ఎక్స్‌రోడ్ వద్ద కురిసిన వర్షానికి రహదారి పూర్తిగా నీటమునిగింది. వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి లోతు అంచనా వేయలేక పలువురు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.