Shuru
Apke Nagar Ki App…
తుమిడి హెట్టి గ్రామపంచాయతీలో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు బోర్వెల్ శుభ్రపరిచే (బ్లీచింగ్) కార్యక్రమం చేపట్టాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రధాన లక్ష్యం. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. – పోరేత్ సూరజ్ సర్పంచ్, తుమిడి హెట్టి గ్రామపంచాయతీ
Suryabhai officel
తుమిడి హెట్టి గ్రామపంచాయతీలో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు బోర్వెల్ శుభ్రపరిచే (బ్లీచింగ్) కార్యక్రమం చేపట్టాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రధాన లక్ష్యం. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. – పోరేత్ సూరజ్ సర్పంచ్, తుమిడి హెట్టి గ్రామపంచాయతీ
More news from తెలంగాణ and nearby areas
- సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.1
- మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాకు లు సింగరేణి సంస్థకే కేటాయించాలి : INTUC సింగరేణి భవిష్యత్ దృష్ట్యా మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కి అప్పగించాలని డిమాండ్ తో intuc నాయకులు శనివారం ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు.1
- చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్తో కవ్వాల్లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం దేవపూర్ SI గంగారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం దేవాపూర్ SI గంగారం దేవపూర్ ఆధ్వర్యంలో దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగులగూడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 బైక్లను, 5 ఆటోలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు మరియు ఈ సందర్భంగా SI గంగారం మాట్లాడుతూ,సైబర్ మోసాలు మరియు సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.ఫేక్ కాల్స్,ఫిషింగ్ సందేశాలు,సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,హెల్మెట్ ధరించడం,సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని,మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని తెలిపారు.గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని,గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి మరియు సమాజానికి హానికరమని వివరించారు.యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం స్వీయరక్షణ మరియు నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు.గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అలాగే ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని, భద్రతను పెంచవచ్చని వివరించారు. పోలీసులు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం మరియు నేరాలను నివారించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో SI గంగారం మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.3