ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన * నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక * కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు) * ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి గుంటూరు, మార్చి 11 : నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వివరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు నిర్దేశించిన వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా మార్చి 9వ తేదీ నుండి మహిళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ లో భాగంగా ప్రతీ ఏడాది రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి అదనంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. *ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ* ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులకు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులన్నారు. కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు), ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగిన విద్యార్హత ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం మరియు ఇంగ్లీషులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. 1.6 కిలో మీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్షకు ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుందని, ఒక తప్పు జవాబుకు పావు మార్కు తీసివేయడం జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీ కీ హాజరు కావచ్చని తెలిపారు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవపరిచిన విద్యార్హత సర్టిఫికేట్లు (X మరియు XII పాసైన సర్టిఫికేట్లు లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్లు), నివాస ధృవీకరణ (డొమిసైల్ సర్టిఫికేట్), ఎన్.సి.సి సర్టిఫికెట్ (ఒక వేళ ఉంటే), ఆధార్ కార్డ్, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇటీవలి తీసుకున్న 10 కాపీలు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు, ప్రతి సర్టిఫికెట్ కు సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు. *ఉదయం 4 గంటల నుండే అనుమతి... ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదు* ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని కోరారు. ఉదయం 4 గంటలకు వచ్చినా అనుమతి ఉంటుందని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆర్.టి.సి బస్సులను విజయవాడ, గుంటూరుల నుండి నడుపుతోందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోరాదని కోరారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల పాల్గొన్నారు.
ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన * నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక * కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు) * ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి గుంటూరు, మార్చి 11 : నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వివరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు నిర్దేశించిన వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా మార్చి 9వ తేదీ నుండి మహిళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ లో భాగంగా ప్రతీ ఏడాది రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి అదనంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. *ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ* ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులకు మార్చి 12న, తెలంగాణ పురుషు అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులన్నారు. కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు), ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగిన విద్యార్హత ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం మరియు ఇంగ్లీషులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. 1.6 కిలో మీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్షకు ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుందని, ఒక తప్పు జవాబుకు పావు మార్కు తీసివేయడం జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీ కీ హాజరు కావచ్చని తెలిపారు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవపరిచిన విద్యార్హత సర్టిఫికేట్లు (X మరియు XII పాసైన సర్టిఫికేట్లు లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్లు), నివాస ధృవీకరణ (డొమిసైల్ సర్టిఫికేట్), ఎన్.సి.సి సర్టిఫికెట్ (ఒక వేళ ఉంటే), ఆధార్ కార్డ్, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇటీవలి తీసుకున్న 10 కాపీలు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు, ప్రతి సర్టిఫికెట్ కు సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు. *ఉదయం 4 గంటల నుండే అనుమతి... ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదు* ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని కోరారు. ఉదయం 4 గంటలకు వచ్చినా అనుమతి ఉంటుందని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆర్.టి.సి బస్సులను విజయవాడ, గుంటూరుల నుండి నడుపుతోందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోరాదని కోరారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల పాల్గొన్నారు.
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- Post by Shyam1
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- విజయనగరం జిల్లా రామభద్రపురంలోని టి.బి.ఆర్ థియేటర్ సమీపంలో బుధవారం బస్సు–లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి సహాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...2