అంగన్వాడీలే బాలల భవితకు పునాది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యానికి తావులేదు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. దుగ్గిరాలపాడులో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 15/09/2026. బాలల భవితకు పునాది అంగన్వాడీలేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు మరింత సమర్థంగా, నాణ్యతతో ప్రజలకు చేరేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా, నాణ్యతతో అందేలా చూడాలని అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వారికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలు, వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. దుగ్గిరాలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా చిన్నారులు, మహిళలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలే బాలల భవితకు పునాది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణపై ప్రత్యేక దృష్టి.. నిర్లక్ష్యానికి తావులేదు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. దుగ్గిరాలపాడులో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 15/09/2026. బాలల భవితకు పునాది అంగన్వాడీలేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు మరింత సమర్థంగా, నాణ్యతతో ప్రజలకు చేరేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా, నాణ్యతతో అందేలా చూడాలని అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, వారికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలు, వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. దుగ్గిరాలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా చిన్నారులు, మహిళలకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
- దేవదేవునికి సతీసమేతంగా 15 సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పొందటం నువ్వు చేసుకున్న పుణ్యం🙏🙏అలాంటి నీకు ప్రాణమిచ్చే సైనికులుగా మమ్మల్ని పుట్టించిన ఆ శ్రీవారికి ఏమి చేయగలం,ఇవ్వగలం,భక్తితో సాష్టాంగ ప్రణామం చేయటం తప్ప🙏🙏....1
- *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన* *ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన* ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. "వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.1
- నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం! దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై.. కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు మీ బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి కాన్పు కోసం మాచవరం ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన కొమ్ము మహిమ అనే బాలింత అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో బాలింతకి కాన్పు చేసిన ఆసుపత్రి ఆయా వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం శిశువు మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు2
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- జైనూర్లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1