మల్బరీ సాగుతో ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం. జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న. శాస్త్రవేత్తలు, అధికారులు మేరా రేషమ్ – మేరా అభిమాన్ 2.0'లో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన. పంట మార్పిడితో అధిక లాభాలు సాధించాలని రైతులకు అవగాహన. మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (డోర్నకల్) ఆగస్టు 26... మల్బరీ సాగుతో ఎకరానికి రెండు లక్షల రూపాయల అధిక లాభాలను గడించవచ్చని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. కేంద్ర సిల్క్ బోర్డు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మల్బరీ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చేపట్టిన "మేరా రేషమ్ – మేరా అభిమాన్ 2.0 (నా పట్టు – నా అభిమానం)" కార్యక్రమంలో భాగంగా బుధవారం డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. సెరికల్చర్ శాఖ జాయింట్ డైరెక్టర్ జి. అనసూయ, కర్ణాటక (మైసూర్) కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్త జె. శ్రీకాంత్ నాయక్ స్థానిక రైతు నందిగామ రామిరెడ్డి మల్బరీ తోటను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మల్బరీ సాగు గురించి క్లుప్తంగా... అధిక ఆదాయం సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప, మొక్కజొన్నలకు బదులుగా పంట మార్పిడి పద్ధతిలో మల్బరీ సాగు చేపడితే ఎకరానికి ఏటా రూ. 2 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చు... ఏడాదికి 5-6 పంటలు: ఒకసారి నాటితే ఏడాదికి 5 నుంచి 6 సార్లు దిగుబడి తీసుకోవచ్చు... తక్కువ పెట్టుబడి – ఎక్కువ రక్షణ: ఈ పంటకు పురుగు మందుల అవసరం ఉండదు, రసాయన ఎరువుల వాడకం చాలా తక్కువ. కోతులు, దొంగల బెడద అస్సలు ఉండదు... సామూహిక సాగు లక్ష్యం: ప్రతి గ్రామంలో క్లస్టర్ స్థాయిలో కనీసం 50 ఎకరాల్లో మల్బరీ సాగు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు... శాస్త్రీయ పరిష్కారాలు: రైతులు ఎదుర్కొంటున్న వేరుకుళ్ళు తదితర సమస్యలకు మైసూర్ శాస్త్రవేత్త శ్రీకాంత్ నాయక్ శాస్త్రీయ నివారణోపాయాలను వివరించారు.... శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, ఆధునిక సాంకేతికతను పాటిస్తే తక్కువ శ్రమతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పట్టు పరిశ్రమ అధికారి కె. సురేష్, స్థానిక రైతులు, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మల్బరీ సాగుతో ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం. జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న. శాస్త్రవేత్తలు, అధికారులు మేరా రేషమ్ – మేరా అభిమాన్ 2.0'లో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన. పంట మార్పిడితో అధిక లాభాలు సాధించాలని రైతులకు అవగాహన. మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (డోర్నకల్) ఆగస్టు 26... మల్బరీ సాగుతో ఎకరానికి రెండు లక్షల రూపాయల అధిక లాభాలను గడించవచ్చని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. కేంద్ర సిల్క్ బోర్డు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మల్బరీ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చేపట్టిన "మేరా రేషమ్ – మేరా అభిమాన్ 2.0 (నా పట్టు – నా అభిమానం)" కార్యక్రమంలో భాగంగా
బుధవారం డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. సెరికల్చర్ శాఖ జాయింట్ డైరెక్టర్ జి. అనసూయ, కర్ణాటక (మైసూర్) కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్త జె. శ్రీకాంత్ నాయక్ స్థానిక రైతు నందిగామ రామిరెడ్డి మల్బరీ తోటను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మల్బరీ సాగు గురించి క్లుప్తంగా... అధిక ఆదాయం సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప, మొక్కజొన్నలకు బదులుగా పంట మార్పిడి పద్ధతిలో మల్బరీ సాగు చేపడితే ఎకరానికి ఏటా రూ. 2 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చు... ఏడాదికి 5-6 పంటలు: ఒకసారి నాటితే ఏడాదికి 5 నుంచి 6 సార్లు దిగుబడి తీసుకోవచ్చు... తక్కువ పెట్టుబడి – ఎక్కువ రక్షణ:
ఈ పంటకు పురుగు మందుల అవసరం ఉండదు, రసాయన ఎరువుల వాడకం చాలా తక్కువ. కోతులు, దొంగల బెడద అస్సలు ఉండదు... సామూహిక సాగు లక్ష్యం: ప్రతి గ్రామంలో క్లస్టర్ స్థాయిలో కనీసం 50 ఎకరాల్లో మల్బరీ సాగు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు... శాస్త్రీయ పరిష్కారాలు: రైతులు ఎదుర్కొంటున్న వేరుకుళ్ళు తదితర సమస్యలకు మైసూర్ శాస్త్రవేత్త శ్రీకాంత్ నాయక్ శాస్త్రీయ నివారణోపాయాలను వివరించారు.... శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, ఆధునిక సాంకేతికతను పాటిస్తే తక్కువ శ్రమతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పట్టు పరిశ్రమ అధికారి కె. సురేష్, స్థానిక రైతులు, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- కమలాపూర్లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.1
- వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. కప్పలకు పెళ్లి చేసి చెరువులో వదిలిన రైతులు ములుగు: పొలాల్లో నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా లక్నవరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవాలని వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు రైతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ‘కప్పతల్లి ఆటలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కప్పలను పట్టుకొచ్చి పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అనంతరం కప్ప వరుడు, వధువులను డప్పు చప్పుళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి కప్పలను నీటిలో వదిలారు. కప్పలు తడిస్తే మేఘాలు కరిగి వర్షాలు కురుస్తాయని తమ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమని గ్రామస్థులు తెలిపారు. వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు.1
- కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు3