Shuru
Apke Nagar Ki App…
వెల్దుర్తిలో ఘనంగా బి ఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకలు. సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ శ్రేణులు వెల్దుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.
చిరు జర్నలిస్ట్
వెల్దుర్తిలో ఘనంగా బి ఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకలు. సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ శ్రేణులు వెల్దుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వెల్దుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.1
- మెదక్ జిల్లా మాసాయిపేట మండలం వ్యాప్తంగా ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. పూర్తి వివరాలు కెళ్తే మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామచావిడి వద్ద బిఆర్ఎస్ జెండా దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరగా ప్రధాన కూడలి వద్ద బిఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ చేసిన సేవలను కొనియాడుతూ మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. అలాగే చిట్టిమిల్ల నాగరాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇప్పుడు కూడా ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని ఈ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏం లేదని ఏదో చేశారు.1
- ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది తమ పనిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.వడ్డెర కులానికి చెందిన సుమారు 30 కుటుంబాలు గత 70 ఏళ్లుగా కోమడిబండ అటవీ ప్రాంతంలో అడవిలో లభించే పండ్లు, పలాలతో పాటు గుట్టలపై ఉన్న బండరాళ్లను కొట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే మిషన్ భగీరథ పథకం కింద గుట్టపై వాటర్ ట్యాంక్ నిర్మాణం సమయంలో అధికారులు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్న సమయంలో, గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమి తమదేనని, గుట్టపై ఉన్న బండరాళ్లు కూడా తమవేనని చెబుతూ తమ ఉపాధిని అడ్డు కుంటున్నారని వడ్డెర కులస్తులు వాపోయారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, జీవనాధారంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం బండరాళ్లు కొట్టి జీవిస్తున్న తమకు తక్షణమే న్యాయం చేసి జీవనోపాధి కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. లేకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వడ్డెర కులస్తులు హెచ్చరించారు.4
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.1
- కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.1
- పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.1
- నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమం - చేపట్టబడిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నార సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అనేది దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్ షిప్ అవకాశాలను భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా వెల్లడించారు. . ఈ పథకంలో భాగంగా: ఇంటర్న్లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం తో పాటు మరొక 6000 పాకెట్ మనీ కింద ఇస్తారన్నారు .భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో అన్ని రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్షిప్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ పాత్రలు మరియు రంగాలలో అవకాశాలను అందించడానికి పీఎంఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రస్తుతం, పైలట్ దశ యొక్క మూడవ రౌండ్ కొనసాగుతుందని తెలిపారు., దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయన్నారు.. 18-25 సంవత్సరాల వయస్సు గల పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక పిఎంఐఎస్ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ మినిస్టర్ షిప్. ఎంసీఏ. గవర్నమెంట్ డాట్ ఇన్ ఎంసీఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు., కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు1