Shuru
Apke Nagar Ki App…
Sai Baba Temple Nirmal District || NEWS UPDATES || KR NEWS 369
KR NEWS 369
Sai Baba Temple Nirmal District || NEWS UPDATES || KR NEWS 369
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- బోథ్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయాయని, కావున బోథ్ లో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలి బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను తీర్చాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోంది దాని బిల్లులు పెండింగులో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి బిల్లులు వెంటనే అందించాలి.బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి.ఇచ్చొడ లో షాది ఖాన కొరకు 3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫ అందించవచ్చని కోరారు.బోథ్ నియోజకవర్గంలో పత్తి, సొయా పండిస్తున్న రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.1
- మెట్ పల్లి, మార్చి 18: పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్, పుల్ల శ్రీనివాస్ గౌడ్లను శాలువాలతో సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.3
- ఉగాది పచ్చడి: షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని దీని అర్థం. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), వగరు (మామిడి ముక్కలు), చేదు (వేప పువ్వు), ఉప్పు, కారం. పంచాంగ శ్రవణం: ఈ ఏడాది మనకు ఎలా ఉండబోతుందో పండితుల ద్వారా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకోవడం.1
- జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు1
- Post by KR NEWS 3691