గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి - ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కెమెరాలు,ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్టాప్లు ఇవ్వాలి గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు గిరిజన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా బానోత్ వెంకన్న మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగు లోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.అర్హత కలిగిన ప్రతి గిరిజన జర్నలిస్టుకు ఇందిరమ్మఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు.అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న గిరిజన జర్నలిస్టులకు కెమెరాలు,ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్టాప్ లు అందించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేక పోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి జర్నలిస్టులకు అవసరమైన సాంకేతిక పరికరాలను అందించాలని కోరారు.గిరిజన జర్నలిస్టులకు వార్తా సేకరణ,డిజిటల్ మీడియా,కెమెరా వినియోగం,సాంకేతిక అంశాలపై ఐటిడిఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. మారుతున్న మీడియా పరిస్థితులకను గుణంగా జర్నలిస్టులకు ఎప్పటి కప్పుడు శిక్షణ అందిస్తే వృత్తిపరంగా మరింత నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి,వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇల్లు,సాంకేతిక పరికరాలు, శిక్షణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్,జిల్లా సభ్యులు పోరిక సునీల్, బానోత్ యోగి,కేతిరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి - ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కెమెరాలు,ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్టాప్లు ఇవ్వాలి గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు గిరిజన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా బానోత్ వెంకన్న మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగు లోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.అర్హత కలిగిన ప్రతి గిరిజన జర్నలిస్టుకు ఇందిరమ్మఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు.అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న గిరిజన జర్నలిస్టులకు కెమెరాలు,ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ల్యాప్టాప్ లు అందించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేక పోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి జర్నలిస్టులకు అవసరమైన సాంకేతిక పరికరాలను అందించాలని కోరారు.గిరిజన జర్నలిస్టులకు వార్తా సేకరణ,డిజిటల్ మీడియా,కెమెరా వినియోగం,సాంకేతిక అంశాలపై ఐటిడిఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. మారుతున్న మీడియా పరిస్థితులకను గుణంగా జర్నలిస్టులకు ఎప్పటి కప్పుడు శిక్షణ అందిస్తే వృత్తిపరంగా మరింత నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి,వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇల్లు,సాంకేతిక పరికరాలు, శిక్షణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్,జిల్లా సభ్యులు పోరిక సునీల్, బానోత్ యోగి,కేతిరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
- ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు2
- నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి................. MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.1
- సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1