Shuru
Apke Nagar Ki App…
బైక్ను ఢీకొట్టిన డీసీఎం… వ్యక్తి అక్కడికక్కడే మృతి నర్సాపూర్ మండలంలో విషాదం నర్సాపూర్ మండలం రుస్తుం పేట్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASHOK VENGANI
బైక్ను ఢీకొట్టిన డీసీఎం… వ్యక్తి అక్కడికక్కడే మృతి నర్సాపూర్ మండలంలో విషాదం నర్సాపూర్ మండలం రుస్తుం పేట్ చౌరస్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- రాంపూర్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా బూరుగుపల్లి మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు మృతదేహాల అంత్యక్రియల కార్యక్రమం ఖర్చును ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తాం -బూరుగుపల్లి, భూపతిపూర్ గ్రామాల మృతుల కుటుంబాలను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుజాతీయ రహదారి రాంపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన కలాలి అమృత గౌడ్, రిషి వర్ధన్ గౌడ్,బి.భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందారు..ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదివారం రెండు కుటుంబాలనుపరామర్శించారు.భూపతిపూర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు.కుటుంబ సభ్యుల బాధను చూసి కూడా భావోద్వేగానికి ఆయన గురయ్యారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.రెండు గ్రామాల మృతదేహాల అంత్యక్రియల ఖర్చులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.1
- చర్లపల్లి ఇందిరమ్మ గృహ కల్పన దగ్గర బొంతు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ముఖ్య తిథిగా పాల్గొన్నారు చర్లపల్లి మాజీ కార్పొరేటర్. బొంతు శ్రీదేవి యాదవ్ మరికొందరు పాల్గొన్నారు1
- Post by Ali ammu1
- Post by Anji Raju1
- ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని దోమకొండ మండలం అంబారిపేట్ సర్పంచ్ కవిత అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు వారి సేవలు కీలకమన్నారు.1
- సోమవారం కలెక్టరేట్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం *తాత్కాలికంగా వాయిదా* జిల్లాలో జనాభా గణన–2027 విధులలో అధికారులు --- , కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు వారికి కేటాయించిన విధులలో అధికారులు నిమగ్నమై ఉన్నందున నేడు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్కటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. .1
- Post by Anji Raju1
- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి1