Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
OM NAMSHIVAYA
కరీంనగర్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంగుల కమలాకర్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
More news from Telangana and nearby areas
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- జగిత్యాల తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను మర మనిషి అనే మాట సరైంది కాదనీ.. ఆ మాటను ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని కవితకు బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిజీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా...కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదన్నారు .బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు..కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు. కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదన్నారు. కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు. కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై తన లక్ష్యం ఉండాల్సి ఉండగా..పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు1
- యువతకు పోలీస్ మేడం పిలుపు: "ఆత్మవిశ్వాసంతో ఎదగండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి" నమస్తే ప్రతినిధి: నేటి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపాలని పోలీస్ మేడం గారు కీలక సూచనలు చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులకు మరియు యువతకు దిశానిర్దేశం చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ముఖ్య అంశాలు: తల్లిదండ్రులే స్ఫూర్తి: పిల్లలు సాధించే విజయాలే తల్లిదండ్రులకు నిజమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన సంపాదనతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యమని తెలిపారు. స్వయంశక్తి: ఇతరులపై ఆధారపడకుండా, నీ మీద నీవు నమ్మకం ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిబద్ధత - క్రమశిక్షణ: చేసే పని ఏదైనా అందులో నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. బాధ్యత: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. "మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు." - పోలీస్ మేడం ఈ వార్తను మీ లోకల్ గ్రూప్స్లో లేదా న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏవైనా మార్పులు కావాలంటే చెప్పండి!1
- కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు1
- *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*1