Shuru
Apke Nagar Ki App…
రైల్వే దుప్పట్లే శాలువాలుగా! - రైల్వేలో దారుణం బయటపడింది.. - WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు... సూర్యాపేట సిటీ: ------------------------ ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
YADLA VENUDHAR
రైల్వే దుప్పట్లే శాలువాలుగా! - రైల్వేలో దారుణం బయటపడింది.. - WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు... సూర్యాపేట సిటీ: ------------------------ ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
More news from Khammam and nearby areas
- అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక... అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు నేలకొండపల్లి మండలం లోని శంకర్ గిరి తండా లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాల పండగ గతంలో లేని విధంగా ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.1
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.1
- ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.1
- బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ ప్రెస్ నోట్ బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు. “యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. “పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.1
- కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.1
- నేను చేసింది తప్పే... నేను చేసింది తప్పే భాసింగా బలాలు ఈశ్వర్.. నేను చేసింది తప్పే: బాసింగ బలాలు ఈశ్వర్ TG: ఇటీవల ఓ యువతితో రూములో కన్పించిన ఫోక్ డాన్సర్, బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కాగా ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని సదరు యువతి వేములవాడ PSలో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది.1
- 23/08/2026 మహబూబాబాద్ : జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను ఉద్దేశించి చారి గారి సందేశం మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు. ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు. యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.1
- కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.1