తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన
తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
- కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.1
- కరీంనగర్లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్కు కృతజ్ఞతగా పాలాభిషేకం* *“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.1
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹4
- వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్పై సంచుల్లో కుక్కలు! అధికారులపై ఆగ్రహం మహారాష్ట్రలోని నిఫద్నగర్లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.1
- తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.2
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1