కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారంతా తమ వెంట తెచ్చుకున్న సద్దిని పంచుకోగా, బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్ను తెరిచి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదువుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ, వాటిని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను క్లీన్ చేయాలని కోరిన బండి సంజయ్, ఈ నెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్శనలో స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మరియు కుల సంఘాల భవన నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయన పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాలును కూడా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్లెట్లను హెడ్మాస్టర్కు అందజేసి, మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి, ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, గుడ్డ, బకెట్లను కూడా వెంట తెచ్చుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, స్వయంగా చీపురు, గుడ్డ, బకెట్లను వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆయన సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది ప్రభావశీలురను (ఇన్ఫ్లూయన్సర్స్ను) కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని కోరిన కేంద్ర మంత్రి, ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని పునరుద్ఘాటించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారంతా తమ వెంట తెచ్చుకున్న సద్దిని పంచుకోగా, బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్ను తెరిచి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదువుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ, వాటిని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను క్లీన్ చేయాలని కోరిన బండి సంజయ్, ఈ నెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్శనలో స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మరియు కుల సంఘాల భవన నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయన పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాలును కూడా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్లెట్లను హెడ్మాస్టర్కు అందజేసి, మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి, ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, గుడ్డ, బకెట్లను కూడా వెంట తెచ్చుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, స్వయంగా చీపురు, గుడ్డ, బకెట్లను వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆయన సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది ప్రభావశీలురను (ఇన్ఫ్లూయన్సర్స్ను) కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని కోరిన కేంద్ర మంత్రి, ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని పునరుద్ఘాటించారు.
- కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు జిల్లా యువజన, క్రీడా శాఖ (DYSO) సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మే 11న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 12 వరకు విజయవంతంగా కొనసాగింది. దాదాపు 17 క్రీడాంశాలలో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్ల పర్యవేక్షణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు మానసికంగా బలంగా మారతారని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నగరపాలక సంస్థ పాలు, గుడ్లు, అరటిపండ్లు, తాగునీరు వంటి పౌష్టికాహార సదుపాయాలను అందించడమే కాకుండా, కోచ్లకు తగిన గౌరవ వేతనం కూడా అందజేసినట్లు వివరించారు. భవిష్యత్తులో కరీంనగర్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లో 3 నుంచి 5 ప్రధాన క్రీడాంశాలలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతం చేసిన జిల్లా క్రీడా శాఖ అధికారులను, కోచ్లను, తల్లిదండ్రులను, పాల్గొన్న విద్యార్థులను, మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సువార్త మరియు మహమ్మద్ ఆయాజ్, DYSO శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్ధన్ రెడ్డి, SGF సెక్రెటరీ వేణు గోపాల్, నగరపాలక సంస్థ అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు.1
- తెలంగాణలో రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు అన్ని పంటలకు ₹500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని, రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని రామారావు ఆరోపించారు. రుణమాఫీని అరకొరగా చేసి వదిలేసిందని, ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ ముగిసినా కంటి తుడుపుగా కేవలం రెండు ఎకరాలకు మాత్రమే భరోసా డబ్బులు ఇచ్చి, 80 శాతం నిధులను విడుదల చేయక చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేస్తుండగా, ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, ప్రైవేట్ దళారులకు మేలు చేసిందని విమర్శించారు. తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి ₹1,200 కోట్ల రూపాయలను నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో యాప్ పేరుతో రైతులను దగా చేస్తోందని, విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని పోలాడి రామారావు అన్నారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేషన్ పద్ధతి దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా మూలన పడేశారని కూడా విమర్శించారు. తమ డిమాండ్ల సాధనకు కరీంనగర్లో తలపెట్టిన రైతు సమర భేరిని విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. త్వరలో లక్షలాది మందితో పార్టీలకు అతీతంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి సభ ద్వారా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రశ్నిస్తామని, డిమాండ్లను ముందుంచి ప్రభుత్వంపై సమర రణ భేరి గర్జన మోగించి కళ్ళు తెరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ఉద్యమిస్తామని రామారావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహా రావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి శుక్రవారం నాడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానసా దేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా, 108 శివలింగాలకు, జంట నాగులకు జలాభిషేకం నిర్వహించారు. తమ మొక్కులు నెరవేర్చుకుంటూ, ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు ముడుపులు కూడా కట్టారు. కాసింపేట గ్రామంలోని మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం, మానసా దేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించగా, వానాకాలం ఆరంభంలో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షం ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కల్పించింది. అయితే, కరీంనగర్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లగా, రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన ఈ జోరు వాన ప్రజలను, ముఖ్యంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కోరుతున్న వారిని సంతోషపెట్టగా, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులలో ఆనందాన్ని నింపింది.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్సోర్సింగ్ సానిటేషన్ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎల్. రమాదేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వేసవి సెలవుల సమయంలో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంగణాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడిన సానిటేషన్ సిబ్బంది సేవలను ఆమె ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈవో రమాదేవి ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు, క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సోఫా ఆయిల్, హిట్, ఆల్ అవుట్ వంటి సామగ్రిని అవసరమైన మేరకు వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా సూచించారు. సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, అనవసరంగా సెలవులు పెట్టకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించి నిర్ణీత డ్రెస్ కోడ్ను పాటించాలని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, సిబ్బందికి ఏవైనా సమస్యలు, అవసరాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సానిటేషన్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి నెల నాలుగు సెలవులు (ఆఫ్లు) మంజూరు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ఈ సందర్భంగా ప్రకటించారు. దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈవో చివరిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పూజిత, ఆలయ ఉద్యోగులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో రాత్రిపూట గంటకు పైగా భారీ వర్షం పడటంతో, గతంలో పగటిపూట 39 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు తగ్గి, ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం ఏర్పడింది. ఈ భారీ వర్షం కారణంగా ప్రజలు ఎండ వేడిమి నుండి ఊపిరి పీల్చుకోగా, వర్షాలు ప్రారంభం కావడంతో అనేక గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ పనులను మొదలుపెట్టారు.1
- ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఓడవాడ ప్రాంతంలో బంగారు ఆభరణాలు శుభ్రం చేస్తానని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం, ఒక వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ప్రత్యేక రసాయనాలతో బంగారు ఆభరణాలను శుభ్రం చేసి కొత్తవిగా మారుస్తానని చెప్పి మహిళల విశ్వాసం చూరగొన్నాడు. అతని మాటలు నమ్మి సుమారు 10 మంది మహిళలు తమ పట్టగొలుసులు, ఇతర బంగారు ఆభరణాలను ఆ వ్యక్తికి అందజేశారు. ఆభరణాలను శుభ్రం చేసే నెపంతో వాటిలో కొంత బంగారు భాగాన్ని అరగదీసిన ఆ వ్యక్తి, ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఆభరణాల బరువు తగ్గినట్లు గుర్తించిన మహిళలు తాము మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు అప్పగించవద్దని వారు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు కోరారు. ఈ మోసం ఓడవాడ ప్రాంతంలో ఆందోళన కలిగించింది.1
- కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారంతా తమ వెంట తెచ్చుకున్న సద్దిని పంచుకోగా, బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్ను తెరిచి వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదువుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ, వాటిని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను క్లీన్ చేయాలని కోరిన బండి సంజయ్, ఈ నెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్శనలో స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మరియు కుల సంఘాల భవన నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయన పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాలును కూడా సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్లెట్లను హెడ్మాస్టర్కు అందజేసి, మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి, ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, గుడ్డ, బకెట్లను కూడా వెంట తెచ్చుకోనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, స్వయంగా చీపురు, గుడ్డ, బకెట్లను వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆయన సిరిసిల్ల పట్టణంలోని కొంతమంది ప్రభావశీలురను (ఇన్ఫ్లూయన్సర్స్ను) కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని కోరిన కేంద్ర మంత్రి, ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని పునరుద్ఘాటించారు.1