Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు పట్టణంలో ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరులో విషాదం ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఆ వ్యక్తి బండిని స్టార్టింగ్ లో ఉంచి ఇంటి గడివేయడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందారూ.ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
Kumar
పుంగనూరు పట్టణంలో ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరులో విషాదం ద్విచక్రవాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఆ వ్యక్తి బండిని స్టార్టింగ్ లో ఉంచి ఇంటి గడివేయడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందారూ.ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి1
- Post by J ramesh1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.3
- Post by Ali ammu1
- Post by Anji Raju1
- కాకినాడ - టీడీపీ అంటే 'తెలుగు డ్ర*గ్స్ పార్టీ' - ఎంపీ పుట్టా మహేష్ డ్ర*గ్స్ బాగోతంపై బాబు సమాధానమివ్వాలి : మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. - డ్ర*గ్స్ వద్దు బ్రో నినాదం కేవలం పబ్లిసిటీ కోసమేనా? - మీ పార్టీ నేతల సంగతేంటి నారా లోకేష్ ? - వరుసగా కూటమి నేతల అసభ్య బాగోతాలు - రాసలీలల్లో ఒకరు, డ్ర*గ్స్ వ్యవహారంలో మరొకరు - అస్తవ్యస్తంగా కూటమి పాలన - తప్పుడు కేసులు నమోదు లో పోలీసులు అత్యుత్సాహం - తప్పుడు పనులు ఆపడంలో మాత్రం వైఫల్యం - ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు : ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ: తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో డ్ర*గ్స్ సేవిస్తూ పట్టుబడటంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అంటే 'తెలుగు డ్ర*గ్స్ పార్టీ'గా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ బాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకురాలేరన్న విషయాన్ని గ్రహించాలని తేల్చి చెప్పారు. ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందనేంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి" అని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే... - టీడీపీ అంటే తెలుగు డ్ర*గ్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్ర*గ్స్ సేవిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన చూస్తుంటే... రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందన్న అనుమానం కలుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ఫాం హౌస్ పై పోలీసులు చేసిన దాడిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మరో శాసనసభ్యుడి కుమారుడు డ్ర*గ్స్ సేవిస్తూ పట్టుబడితే ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. సాధారణంగా ఉదయం లేచిన దగ్గరనుంచి సమాజానికి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు? - డ్ర*గ్స్ తో పట్టుబడినా టీడీపీ నేతలపై చర్యలు నిల్... డ్ర*గ్స్ రహిత సమాజాన్ని సృష్టిద్దామంటూ.. డ్ర*గ్స్ వద్దు బ్రో అని చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భారీ ఉద్యమం నడిపి, ప్రచారం కూడా చేశాడు. అంటే డ్ర*గ్స్ వద్దు బ్రో అని ప్రజలకు మాత్రమే చెప్పే టీడీపీ నేతలు, వారి పార్టీలో మాత్రం డ్ర*గ్స్ సేవిస్తారా? టీడీపీ ఏ స్థాయికి దిగజారిందంటే ఎదుటవారికి మాత్రమే నీతులు చెబుతూ... తాము మాత్రం అన్ని దుర్మార్గాలే చేస్తుంటారు. ఓ టీడీపీ నేత రాసలీలల వీడియో పట్టుబడితే.. మరో నేత అసభ్యంగా మహిళల పట్ల ప్రవర్తిస్తూ పట్టుబడతారు. కొంతమంది గంజాయితోనూ, మరికొందరు డ్ర*గ్స్ తో పట్టుబడినా పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ ఎలాంటి స్పందన ఉండదు. - డ్ర*గ్స్ వదిలి - రెడ్ బుక్ అమల్లో పోలీసులు.. డ్ర*గ్స్ రహిత ఏపీ అని హోంమంత్రి ప్రకటన ఇచ్చిన పదిరోజుల లోపే ఆంధ్రప్రదేశ్ లో డ్ర*గ్స్, గంజాయి రెండూ పట్టుబడ్డాయి. చంద్రబాబు పూర్వ సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో ఓ యువకుడు గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేస్తే దిక్కూ మొక్కూ లేదు. కుప్పంలోనూ గంజాయి పట్టుబడింది. చంద్రబాబు నివాసానికి సమీపంలోని ఇబ్రహీం పట్నంలో రూ.47 కోట్ల విలువైన డ్ర*గ్స్ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అయినా పోలీసులు ఇవేమీ పట్టడం లేదు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ... తప్పుడు కేసులు నమోదు చేయడంలో బిజీగా ఉన్నారు. శాంతి భద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికివదిలేసింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడితే ఇంకా సిగ్గులేకుండా వైయస్.జగన్ ని తిట్టడం అలవాటుగా మారింది. - ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై మీ స్పందనేంటి చంద్రబాబూ? ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్.. టీడీపీలో కీలక నేత డ్ర*గ్స్ వ్యవహారంలో దొరికితే మీ పార్టీ స్పందన ఏంటనేదానిపై సమాజం ఎదురు చూస్తుంది. కేవలం ఎదుటివారికి చెప్పడానికే మీకు నీతులు ఉన్నాయా? డ్ర*గ్స్ అరికడుతున్నామని చెబుతున్న మీ ప్రచారం ఏమైంది? బాధ్యతాయుతమైన స్ధానంలో ఉన్న వ్యక్తులే ఈ రకమైన పనులకు పాల్పడ్డం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు మౌనంగా ఉంటే... అంతా సద్దుమణిగి పోతుందన్నదే మీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇవాల్టికి కూడా పెద్ద ఎత్తున గంజాయి, నాటు సారా ఎక్కడి పడితే అక్కడే దొరుకుతుంది. అక్రమ సారా భారీగా తయారు చేసి పెద్ద విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు విశాఖలో ఒక కంటైనర్ దొరికితే దానిమీద కూటమి పార్టీ నేతలు అప్పటి వైయస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతమైన దుష్ప్రచారం చేశాయి. లక్షల కోట్ల డ్ర*గ్స్ అంటూ మీకున్న ప్రచార మాధ్యమాలతో దుమ్మెత్తి పోశారు. తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి డ్ర*గ్సే కాదని రిపోర్టులు వస్తాయి. మీకున్న శక్తితో ప్రచారం చేసుకుంటూ నడిపిస్తున్నారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డంగా దొరుకుతున్న ఉదంతాలే మీ ప్రచార ఆర్భాటాలకు ,వాస్తవాలకు ఉన్న తేడాను తెలియజేస్తోంది. ఇటీవలే టీటీడీ పాలకమండలి చైర్మన్, మరో శాసనసభ్యుడి బాగోతం వెలుగులోకి రాగా... ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారం వెలుగుచూసింది. అయినా అడ్డగోలుగా మీ అనుకూల ప్రచారం చేస్తూ... తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి డ్ర*గ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి మీకున్న ప్రణాళికలు ఏంటో కూడా తెలియడం లేదు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికే తప్ప.. ఇలాంటి తప్పుడు పనులు ఆపే కార్యక్రమాలు చేయలేకపోవడం సిగ్గుచేటని కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఎంపీ డ్ర*గ్స్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని, తద్వారా సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం1
- Post by Anji Raju1