Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ యాజమాన్యం మాట తప్పిందా? ప్రైవేట్ కండక్టర్ల ఆవేదన బహిర్గతం నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతంలో ఆర్టీసీ యాజమాన్యంపై ప్రైవేట్ కండక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ చేస్తే ఒక్కో కండక్టర్కు ₹1000 చెల్లిస్తామని ముందుగా హామీ ఇచ్చి, పని చేయించిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో తాత్కాలికంగా కండక్టర్లుగా పనిచేసిన పలువురు కార్మికులు మాట్లాడుతూ—“సార్ డ్యూటీ పూర్తి చేశాం, మా కూలీ డబ్బులు ఇవ్వండి” అని అడిగితే, “డబ్బులు లేవు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మండే ఎండల్లో, కష్టపడి విధులు నిర్వర్తించినప్పటికీ, హామీ ఇచ్చిన పారితోషికం ఇవ్వకపోవడం అన్యాయమని వారు అంటున్నారు.
Solanke Ravi
ఆర్టీసీ యాజమాన్యం మాట తప్పిందా? ప్రైవేట్ కండక్టర్ల ఆవేదన బహిర్గతం నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతంలో ఆర్టీసీ యాజమాన్యంపై ప్రైవేట్ కండక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ చేస్తే ఒక్కో కండక్టర్కు ₹1000 చెల్లిస్తామని ముందుగా హామీ ఇచ్చి, పని చేయించిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో తాత్కాలికంగా కండక్టర్లుగా పనిచేసిన పలువురు కార్మికులు మాట్లాడుతూ—“సార్ డ్యూటీ పూర్తి చేశాం, మా కూలీ డబ్బులు ఇవ్వండి” అని అడిగితే, “డబ్బులు లేవు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మండే ఎండల్లో, కష్టపడి విధులు నిర్వర్తించినప్పటికీ, హామీ ఇచ్చిన పారితోషికం ఇవ్వకపోవడం అన్యాయమని వారు అంటున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- TGS RTC cargo .............................1
- కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారిపై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హరీష్ రావు. పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, రాజా పూర్ణనందం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.1
- The Howrah roadshow was truly unmatched! The overwhelming response took it beyond the planned route, even crossing the Howrah Bridge into Kolkata.1
- ఆదిలాబాద్ అర్బన్ :తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం RTC కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కార్మికుల కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదని,వారి డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి,కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా సమ్మెలో ఉన్న కండక్టర్ల పేరు మీద టికెట్లు ఇష్యూ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అక్రమ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇది కార్మికులను మోసం చేయడమేనని మండిపడ్డారు,అలాగే కార్మికులు చేస్తున్న పోరాటం కేవలం వారి హక్కుల కోసమే కాదని,ఆర్టీసీ మనుగడ కోసమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని,వారి పోరాటం విజయవంతం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. తాళ్ల రవీందర్ ప్రకటనతో సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.1
- Post by Vishwamber Rao1
- బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి తమ టెంట్లను తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎండలో అయినా నిలబడి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానికంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేస్తూ, తమ టెంట్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు కోరారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.1
- Post by Solanke Ravi1
- ప్రభుత్వం తో చర్చలు విఫలం కావడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ మంటల్లో తీవ్రంగా గాయపడ్డ శంకర్ గౌడ్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు ధర్నాకు దిగుతున్న ఆర్టీసీ కార్మికులు. పరిస్థితి ఉద్రిక్తం..!1
- Post by Vishwamber Rao1