అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్ పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్ పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
- అందుబాటులోకి స్మార్ట్ కిచెన్ సెంటర్ పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న సిద్దవటం స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మరో 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న తెలిపారు. సిద్దవటంలోని స్మార్ట్ కిచెన్ సెంటర్ ను మంగళవారం పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న, చిన్న పెండింగ్ పనులను పూర్తి చేసి 10 రోజుల్లోగా కిచెన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ లో అవసరమైన చోట్ల 15 ఇంచుల ఎక్జాస్ట్ ఫ్యాన్ బిగించాలని ఆదేశించామన్నారు. ఇంటర్నల్ డ్రైన్, వంట పరికరాలు, ఆర్ఓ ఫ్లాంటును పరిశీలించడం జరిగిందన్నారు. టెక్నీషియన్ వచ్చి స్మార్ట్ కిచెన్ సెంటర్ లో వంట పరికరాలు బిగిస్తే పనులు పూర్తి అవుతాయన్నారు. ఎల్ఈడి లైట్లు, పైపులను సక్రమంగా అమర్చాలని అధికారులు తనిఖీ చేసినప్పుడు చెడ్డపేరు వస్తుందని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, సైట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.1
- కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.1
- సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ: తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంలో బడులు వెలవెలబోతున్నాయి.ప్రైవేట్ బడులు కళకళలాడుతున్నాయని మాజీ ఎంపీ తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2023–24లో ఉన్న 45,991 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు 2025-26 నాటికి 45,019కు తగ్గి 972 పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య రూ.5.86 లక్షలు తగ్గగా.. ప్రైవేట్ పాఠశాలల్లో రూ.2.86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.1
- అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా.. ప్రజలు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచన. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్కు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ బీట్ పోలీసింగ్ను పెంచడంతో పాటు క్రైమ్ విభాగం సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. పీలేరు పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చెడ్డీ గ్యాంగ్కు సంబంధించిన కదలికలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీలేరు పట్టణంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు.1
- 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.1
- అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. అన్నమయ్య జిల్లా: పుంగనూరు: అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలలో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించిన పుంగనూరు పోలీసులు. పుంగునూరు టౌన్ శ్రీకృష్ణదేవరాయలు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడిన నిందితుడు. దేవాలయాలలో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన యలకపల్లి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం. పుంగనూరు పరిధిలోని సోమల,చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినన పోలీసులు. కేసును ఛేదించిన పుంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు.4
- ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1