తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.2
- కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.2
- గంగా నగర్ పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గంగా నగర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళ వారం ఐదవ డివిజన్ గంగా నగర్ లో పర్యటించారు.ఈ సందర్బంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి నాలాల్లో పూడిక తొలగింపు , పిచ్చి చెట్లు, రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను నిర్వహించారు.పనుల పర్యవేక్షణ అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరానికి చివరన ఉండడం వలన డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థoగా తయారైందని అన్నారు.స్థానికులు చెత్తను తీసుకువచ్చి బయట పార ఫోస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని అన్నారు. రోడ్లు, కాలువలు కూడా అక్రమించి నిర్మాణాలు చేసుకోవడంతో రాకపోకలకు, మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతున్నదని అన్నారు ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది గంగా నగర్ అభివృద్ధి చేయడానికి ఎం ఎల్ ఏ సహకారంతో రూ 5.00 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ప్రజలు కూడా సహకరించి చెత్త బయట వేయకుండా మునిసిపల్ వాహనానికి అందించాలని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మాటూరి సత్య ప్రసాద్ , నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ సంపత్ కుమార్ , టి పి ఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రా రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ,సానిటరీ సూపర్ వైజర్ సోమేశ్, వాటర్ సప్లై సూపర్ వైజర్ శశి కుమార్ ,ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు1
- బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి మరియు అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ గార్లు మాట్లాడుతూ, ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతటా ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సార్వత్రిక విద్య, ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పించాలని, బెల్లంపల్లి పట్టణం చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని, క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బీకేయంయూ జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొల్లు బానేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోషం, బీకేయంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, బొల్లం తిలకంబెడ్కర్, రత్నం రాజం, మేకల రాజేశం, మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శులు రత్నం ప్రవీణ్ కుమార్, వడ్డె మల్ల రాజేందర్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు బొంకూర్ రామచందర్, నాయకులు జూపాక కొమురయ్య, బండారు శంకర్, అందుగుల రాజేందర్, స్వామి దాసు, కే. తిరుపతి, చంద్రయ్య, నర్సింగ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.1
- కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.1
- అమావాస్య సందర్భంగా కలిసుందాం రా మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ... కరీంనగర్ జిల్లాలోని కమాన్ సర్కిల్ సమీపంలో గల సప్తగిరి ఆయిల్ స్టోర్అమావాస్య సందర్భంగా ఆనందకరి అక్షయపాత్ర, కలిసుందాం రా మిత్ర బృందం, ఎలుగూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.3
- కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా సాగి భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు2
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్కుమార్, గంగుల డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.2