Shuru
Apke Nagar Ki App…
నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
Seelam Ashok Reddy Flex Print
నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.1
- రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది1
- నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.1
- కుష్టు రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కాకినాడ ఎంపీజే ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతిపదిహేను రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ( sharp) RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూస్మశానవాటిక దగ్గర వున్న లెప్రసీ కాలనీ నందు 55 మంది లెప్రసీ రోగులకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు MPJ సానుభూతి పరురాలైన శ్రీమతి బీబి గారు వారి భర్త గారైనా స్వర్గీయ అలీ గారి జ్ఞాపకార్ధం ₹2500/- ఆర్ధిక సహాయం చేస్తున్నారు. డ్రెస్సింగ్ తో పాటు 39 మంది స్త్రీలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్ లు, చికెన్ బిర్యాని తోపాటు పరిశుభ్రతకు అవసరమయ్యే వస్తువుల (surf ప్యాకెట్ లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కొబ్బరి నూనె, షాంపూ ప్యాకెట్, soap) కిట్ కూడా లెప్రసి రోగులకు ప్రదానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు Md హలీం గారు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రటరీ Md ఉస్మాన్ షబ్బీర్ గారు, షాకీర్ గారు, దౌలానా బాషా గారు, Md ఇబ్రహీం గారు, కలీం గారు, Md రహ్మతుల్లా గారు పాల్గొన్నారు.1
- పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన రౌతు జానయ్య అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన పక్కింట్లోని రాము అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కనుఎయిర్ గన్ తో కాల్చి చంపాడని రాము స్టేషన్ లో పిర్యాదు చేసాడు. రాముకు చెందిన పెంపుడు కుక్కరోజూ తన ఇంటికి వస్తుండడంతో కోపం పెంచుకున్న జానయ్య తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్చి చంపాడు.తాను ప్రేమగా పెంచు కుంటున్న కుక్కను కక్ష పూరితంగా జానయ్య చంపాడని రాము ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాము ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జానయ్య పై కేసు నమోదు చేశారు.1
- *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్పోర్టులో చిక్కిన ప్యాసింజర్.* దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.1
- నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1
- గంగా నదిలో చూస్తుండగానే మునిగిపోయిన బోటు చూస్తుండగానే మునిగిపోయిన బోటు.... బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఓ పడవ బోల్తా పడింది. అందులోని 21 మంది కూలీలు ప్రవాహంలో మునిగిపోయారు. SDRF వేగంగా స్పందించి 20 మందిని కాపాడగా మరో కార్మికుడి ఆచూకీ గల్లంతయింది. వరద నివారణ చర్యల్లో భాగంగా వారు నదిలోకి వెళ్లారని అధికారులు వెల్లడించారు. బోటు మునిగిపోయిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి....1