Shuru
Apke Nagar Ki App…
ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని మాజీమంత్రి జీవన్ రెడ్డి.... కాంగ్రెస్ లో అనగతొక్కబడుతున్న వారిని సమీకరించేందుకు సన్నాహాలు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.
K.V.REDDY
ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని మాజీమంత్రి జీవన్ రెడ్డి.... కాంగ్రెస్ లో అనగతొక్కబడుతున్న వారిని సమీకరించేందుకు సన్నాహాలు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.
More news from తెలంగాణ and nearby areas
- అసెంబ్లీ కమిటీ హాల్లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.1
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలం వెంక రెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.1
- *గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం* * శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు * వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి - మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి * దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం గజ్వేల్, 29 ఆదివారం మార్చ్ 2026 సిద్దిపేట : జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవనంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కుల దైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం కేటాయించిన వైశ్య భవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో, దాదాపు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో కొమురవేల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్, ఏ ఏం సి డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఎర్రం శ్రీనివాస్, తోట బిక్షపతి, ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మణులు, చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ జ్యూవెల్లరీ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత కరుణాకరన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జనగాం జిల్లా:అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు. కడియం శ్రీహరి తమకు తండ్రి సమానమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆ కాలంలోని కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.1
- ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.2
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.1