logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ.. గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు.. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా, పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు...,

9 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ.. గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు.. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా, పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు...,

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 100 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ డబుల్ రోడ్డును ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ సాదు సాంబశివరావు వెల్లడించారు.
    1
    గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 100 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ డబుల్ రోడ్డును ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ సాదు సాంబశివరావు వెల్లడించారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *గుంటుపల్లి రోడ్డు మీద వెళ్తే ముక్కు మూసుకోవాల్సిందే..!* *ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19,* గుంటుపల్లి రమేష్ నగర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ డ్రైనేజీని రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై చెడు వాసన వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఎక్కడెక్కడ నుంచో డ్రైనేజీని తీసుకొచ్చి నిత్యము ఈ రోడ్డుపై వదిలుతున్నారని, ముక్కు మూసుకోక తప్పడం లేదంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    1
    *గుంటుపల్లి రోడ్డు మీద వెళ్తే ముక్కు మూసుకోవాల్సిందే..!*
*ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19,*
గుంటుపల్లి రమేష్ నగర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ డ్రైనేజీని రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై చెడు వాసన వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఎక్కడెక్కడ నుంచో డ్రైనేజీని తీసుకొచ్చి నిత్యము ఈ రోడ్డుపై వదిలుతున్నారని, ముక్కు మూసుకోక తప్పడం లేదంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    8 hrs ago
  • రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
    1
    రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.
    1
    *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    8 hrs ago
  • ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం... స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి. మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ.. 10రోజుల వ్యవధిలో ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    3
    ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం...
స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి.
మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ
తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ..
10రోజుల వ్యవధిలో  ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసులు నమోదు నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ నిధులు పక్కదారికి మెప్మా శాఖలో ఎనిమిది మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన అఖిల నరసరావుపేట వన్ టౌన్ లో ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు. ప్రణతి,దీప,భూదేవి, మల్లిఖార్జునలతో పాటూ మరికొందరుపై కేసు నమోదు.
    1
    పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసులు నమోదు
నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్
నిధులు పక్కదారికి మెప్మా శాఖలో  ఎనిమిది మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు
అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల  ఫిర్యాదు
నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన  అఖిల
నరసరావుపేట వన్ టౌన్ లో ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు.
ప్రణతి,దీప,భూదేవి, మల్లిఖార్జునలతో పాటూ మరికొందరుపై కేసు నమోదు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అద్దంకి ఆర్టీసీ డిపో ఆవరణలో గురువారం SWF ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. పినకిల్ ప్రైవేట్ కంపెనీకి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టడాన్ని యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అద్దంకి ఆర్టీసీ డిపో ఆవరణలో గురువారం SWF ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. పినకిల్ ప్రైవేట్ కంపెనీకి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టడాన్ని యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    1
    *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!*
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.