జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ట్రాన్స్జెండర్స్ సంఘం నాయకులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న గారి నాయకత్వం తమకు విశ్వాసాన్ని కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ సమాజ సమస్యలను గుర్తించి, వారికి గౌరవప్రదమైన జీవితం అందించేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ హృదయాలను తాకాయని,పార్టీ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ— సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ట్రాన్స్జెండర్ సమాజానికి అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా, సమానత్వం, గౌరవం, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి తమ అచంచల మద్దతు కొనసాగుతుందని ట్రాన్స్జెండర్స్ సంఘం నాయకులు స్పష్టం చేశారు.
జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ట్రాన్స్జెండర్స్ సంఘం నాయకులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న గారి నాయకత్వం తమకు విశ్వాసాన్ని కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ సమాజ సమస్యలను గుర్తించి, వారికి గౌరవప్రదమైన జీవితం అందించేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ హృదయాలను తాకాయని,పార్టీ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ— సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ట్రాన్స్జెండర్ సమాజానికి అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా, సమానత్వం, గౌరవం, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి తమ అచంచల మద్దతు కొనసాగుతుందని ట్రాన్స్జెండర్స్ సంఘం నాయకులు స్పష్టం చేశారు.
- ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది4
- Post by Bondhu Suresh1
- బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.2
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- Post by Syyed taher1
- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Bondhu Suresh1