logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మైలవరంలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన* *మైలవరం, ఏప్రిల్ 22, (గళమ్ న్యూస్)* మైలవరం దేవుని చెరువులోని ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.వారానికి ఐదుసార్లు గుడ్లు ఇస్తున్నారని విద్యార్థులు చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, రుచి, శుచితో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.విద్యార్థుల హాజరు పట్టీని పరిశీలించారు.స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వ లక్ష్యాల మేరకు అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.చిన్నారులు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

23 hrs ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago
569bdd33-2841-469f-8a99-31eb1f3fa2d7

*ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ మైలవరంలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన* *మైలవరం, ఏప్రిల్ 22, (గళమ్ న్యూస్)* మైలవరం దేవుని చెరువులోని ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.వారానికి ఐదుసార్లు గుడ్లు ఇస్తున్నారని విద్యార్థులు చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, రుచి, శుచితో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.విద్యార్థుల హాజరు పట్టీని పరిశీలించారు.స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వ లక్ష్యాల మేరకు అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.చిన్నారులు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

More news from Andhra Pradesh and nearby areas
  • కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    1
    కృష్ణ జిల్లా మచిలీపట్నం :- 
తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు.
ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ
2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ
3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ
వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    23 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    2 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    19 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ... హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య... పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ.... కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం... మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ... సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన... ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్... కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు... రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు.... ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన... అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక... ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు.. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.
    1
    నల్లగొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ ఆరోపణ...
హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని రవీంద్ర కుమార్ వ్యాఖ్య...
పీసీ ఘోష్ కమిషన్ రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శ....
కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని నేతల స్పష్టం...
మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపణ...
సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన...
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్...
కాంగ్రెస్ హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపాటు...
రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా లేదు, కరెంట్ లేదు అంటూ విమర్శలు....
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని బీఆర్ఎస్ ప్రకటన...
అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక...
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు..
జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలూ చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, పార్టీ నేతలు తదితరులు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.