Shuru
Apke Nagar Ki App…
తమిళనాడు లో డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ... అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్యకర్తకు ఎమ్మెల్యే కారులో సీటు కూడా ఇవ్వరు .. *తమిళనాడు రాజకీయలు:* ▪️విజయ్ ఫై సోషల్ మీడియాలో చర్చ ... డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. ▪️ఏ తండ్రికి దక్కని అవకాశం ఈ తండ్రికి దక్కింది. ▪️కారు నడిపినంత సేపు విజయ్ తన ప్రక్కనుంటే, ▪️రేపు తన కొడుకు MLA అవుతే విజయ్ ప్రక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో. ▪️ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి ఏ తండ్రికి అయినా. *▪️" విజయ్ " లాంటి నాయకుడు నిజంగా ప్రజల్లోకి వస్తే విజయం తథ్యం అంటున్నారు ప్రజలు.*
Kumar
తమిళనాడు లో డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ... అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్యకర్తకు ఎమ్మెల్యే కారులో సీటు కూడా ఇవ్వరు .. *తమిళనాడు రాజకీయలు:* ▪️విజయ్ ఫై సోషల్ మీడియాలో చర్చ ... డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం పై ప్రశంసలు వెల్లవ. ▪️ఏ తండ్రికి దక్కని అవకాశం ఈ తండ్రికి దక్కింది. ▪️కారు నడిపినంత సేపు విజయ్ తన ప్రక్కనుంటే, ▪️రేపు తన కొడుకు MLA అవుతే విజయ్ ప్రక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో. ▪️ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి ఏ తండ్రికి అయినా. *▪️" విజయ్ " లాంటి నాయకుడు నిజంగా ప్రజల్లోకి వస్తే విజయం తథ్యం అంటున్నారు ప్రజలు.*
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.1
- అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు: DSP డేగల ప్రభాకర్ పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రమణి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.1
- వైరల్: కారు ఢీకొనడంతో మహిళ గాలిలోకి విసిరివేయబడింది *రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన తెలియజేస్తుంది. కర్ణాటకలోని బంట్వాల్లో భారతి(48) అనే యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. మధ్యలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం వేగాన్ని అంచనా వేయకుండా ముందుకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాలిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భారతిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.*1
- కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో శుక్రవారం మన ఊరు మన నీరు మన అందరి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సాగునీటి చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకుడు న్యాయవాది వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఓటమి నాయకులు పాల్గొన్నారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోఘనంగా గరుడ సేవ మండల కేంద్రమైన విడవలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతా లక్ష్మ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు సీతారాములకు గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక పూలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలంగి సేవ అలంకరణ వచ్చిన భక్తులను ఆకర్షించింది. ఈ అలంకరణలో స్వామి అమ్మవార్లను చూసిన భక్తులు ముగ్దులే మైమరిచినారు. ఈ పూలంగి సేవ కు ఉభయకర్తలుగా కీర్తిశేషులు మడపర్తి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు మంజుల వేణుగోపాల్ వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు.4
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- ' కామా తురాణం న భయం న లజ్జ ' ... తహశీల్దార్ తీరు *సత్యసాయి జిల్లా:* *▪️సమస్య కోసం వస్తే ... సరసాలు, ఆధారాలు ఇచ్చిన కూడా విచారణకే పరిమితం...?* గతంలోను ఇలాంటి తరహా ఘటన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. *▪️ఇలాంటి అక్రమ సంబంధంలు బయట పడని అధికారులు ఎంత మంది ఉన్నారో ...?* *▪️ఆ తహసిల్దార్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్.* ▪️పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమందపల్లి తహసిల్దార్ పై కర్ణాటక బాగేపల్లి కి చెందిన విద్యుత్ ఉద్యోగి వేణు సంచలన ఆరోపణలు. ▪️ఆంధ్రాలో చలమత్తూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న తన భార్యతో తహశీల్దార్ మారుతి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితుడు. ▪️రెవెన్యూ సమస్యలపై వెళ్లిన మహిళ ఉపాధ్యాయురాలి ఫోన్ ట్రాప్ చేసి వలలోకి వేసుకున్న తహశీల్దార్ ▪️భర్త వేణుని వదిలేసి తహశీల్దార్ తో వెళ్లిపోయిన భార్య ఆందోళనలో భర్త. ▪️సమస్యను కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ ఉద్యోగి వేణు. ▪️బాధితుని సమస్య విన్న కలెక్టర్ తక్షణమే విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్కు ఆదేశం.1