logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Karri Sankara Reddy
Karri Sankara Reddy
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
    2
    నౌపడలో 
ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ
మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో
సంతబొమ్మాలి (నౌపడ ) :  ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి  మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్  నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
    1
    సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ 
గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి  అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో  జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.
    1
    రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ..
భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం ​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.
    1
    గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం
​భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం   దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం  గిన్నిస్  బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది.  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్  సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. 
ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ​13,000 మంది  పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా  నృత్యాన్ని ప్రదర్శించారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ​పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ​విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
    3
    లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు 
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని  విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
​పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
​విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం  వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
    user_ARIGI SATYARAO
    ARIGI SATYARAO
    Local News Reporter గంట్యాడ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అరకు: ధింసా నృత్యంతో రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న విద్యార్ధినులు విద్యార్ధినిల ధింసా ప్రాక్టీస్ లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వేదిక కలకలలాడుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగష్ట్ 1న భోగాపురం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడి కి ధింసా నృత్యంతో స్వాగతం పలకడానికి 14 వేల మంది విద్యార్ధినిలు సిద్దమవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్ధినిల వృత్తాకార కదలికలు, లయబద్ధ అడుగులు, సాంప్రదాయ వాయిద్యా శబ్దాలతో వేదిక ప్రాంతం అలరారుతోంది.
    1
    అరకు: ధింసా నృత్యంతో రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న విద్యార్ధినులు
విద్యార్ధినిల ధింసా ప్రాక్టీస్ లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వేదిక కలకలలాడుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగష్ట్ 1న భోగాపురం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడి కి ధింసా నృత్యంతో స్వాగతం పలకడానికి 14 వేల మంది విద్యార్ధినిలు సిద్దమవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్ధినిల వృత్తాకార కదలికలు, లయబద్ధ అడుగులు, సాంప్రదాయ వాయిద్యా శబ్దాలతో వేదిక ప్రాంతం అలరారుతోంది.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ
ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి నాంది అంటూ మర్రిపాడు లో ర్యాలీ సంతబొమ్మాలి : రాష్ట్ర రవి శాఖ మంత్రి, టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చన్న నాయుడు ఆదేశానుసారం భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్ పోర్టర్ ఉత్తరాంధ్రకి ఒక వరమని ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో భోగాపురం ఎయిర్పోర్ట్-అభివృద్ధికి నాంది అనే నినాదంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం సాయంకాలం సంతబొమ్మాలి మండల మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు జగన్నాథం, మర్రిపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడ్డ గణేష్, శెలగపేట నాయకులు బచ్చల బెనర్జీ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోపింటి రాజా రెడ్డి, జనసేన నాయకులు భీమారావు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి నాంది అంటూ మర్రిపాడు లో ర్యాలీ
సంతబొమ్మాలి : రాష్ట్ర రవి శాఖ మంత్రి, టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చన్న నాయుడు ఆదేశానుసారం భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్ పోర్టర్ ఉత్తరాంధ్రకి ఒక వరమని ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో భోగాపురం ఎయిర్పోర్ట్-అభివృద్ధికి నాంది అనే నినాదంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం సాయంకాలం సంతబొమ్మాలి మండల మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  నీటి సంఘం అధ్యక్షులు జగన్నాథం, మర్రిపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడ్డ గణేష్, శెలగపేట  నాయకులు బచ్చల బెనర్జీ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోపింటి రాజా రెడ్డి, జనసేన నాయకులు భీమారావు  కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.