logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగాం జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.
    1
    ఈరోజు సుధనపల్లి గ్రామంలో  Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 
1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 
2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 
3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం 
పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. 
ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
    4
    జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...
    1
    ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు...
ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి...
ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది...
పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు...
ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు...
ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం...
మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం...
వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్...
మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.
    1
    ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు కి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి  తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నా
పొన్నం ప్రభాకర్, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధం, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ
రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగువారి మధ్య ద్వేషాలు రగిలిస్తాయి 
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్-పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీశాయి 
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విభజన వ్యాఖ్యలే ఈ వివాదాలకు మూలమ్ 
విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి 
తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని విజ్ఞప్తి 
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం 
రెండు రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి 
విభజనను భారత్-పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య 
తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. 
తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. 
తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే! 
నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి. 
చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో మేం అన్ని అణచివేతల్ని ఎదుర్కొన్నాం 
కష్ట`నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశాం. 
ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. 
దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు తల్లి సోనియా గాంధీ సారధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదికగా అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయింది. 
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటింది. 
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయి. 
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నాం.
తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. 
ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. 
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. 
ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి.
రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయా గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయా గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ జిల్లా శివునిపల్లిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగా, ఆమె పెద్ద కుమారుడు తమ్ముడిని చూసుకున్నాడు. పరీక్ష పూర్తయ్యే వరకు చిన్నారిని ఆడిస్తూ, తల్లికి ధైర్యం చెప్పిన ఆ బాలుడిని స్థానికులు అభినందించారు. చదువుపై ఆసక్తితో చంటి పిల్లలతోనే మహిళలు పరీక్షలకు హాజరవడం విశేషంగా మారింది.
    1
    జనగామ జిల్లా శివునిపల్లిలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగా, ఆమె పెద్ద కుమారుడు తమ్ముడిని చూసుకున్నాడు. పరీక్ష పూర్తయ్యే వరకు చిన్నారిని ఆడిస్తూ, తల్లికి ధైర్యం చెప్పిన ఆ బాలుడిని స్థానికులు అభినందించారు. చదువుపై ఆసక్తితో చంటి పిల్లలతోనే మహిళలు పరీక్షలకు హాజరవడం విశేషంగా మారింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు... వ్యక్తులతో పనిలేదు... సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా అని పిలుపునిచ్చారు.
    4
    డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై  మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు... వ్యక్తులతో పనిలేదు... సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా అని పిలుపునిచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • *మేధావులారా....డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి* *మీ మౌనం సమాజానికి అరిష్టం* *సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే ప్రయోజనాలను వివరించండి* *కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి* *మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే* *మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసింది* *సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమోళి, సుప్రియాలకు పదవులిస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లా?* సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా? కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బస సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు వాసాల రమేశ్, గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే.... అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్... అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం. సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అంతటి మహోన్నుతుడి గురించి భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. నిజానికి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి? అణగారిన వర్గాల బాధలను తెలుసుకోవడం. దళిత కులంలో పుట్టి అంటరానివాడిగా వెలివేయబడ్డా, తినడానికి తిండి లేకపోయినా ఒకపూట పస్తులుంటూ ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కుని మొక్కవోని దీక్షతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్ష్యాన్ని చేరుకుని అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించారు. ఎక్కడో మధ్యప్రదేశ్ లోని ‘‘మౌ’’ అనే ఓ చిన్న పల్లెటూళ్లో దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ పుట్టుకతో సంపన్నుడు కాదు... కటిక పేదరికాన్ని అనుభవించాడు. గుడ్డి దీపం వెలుతురులో బతికినోడు. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం చేసేవాడు. డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే ఫణంగా పెట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆసక్తి ఉన్న స్తోమత లేకపోవడంతో అప్పటి బరోడా మహారాజు వద్దకు పోయి సాయం కోరితే.... విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చాక 10 ఏళ్ల పాటు తన సంస్థానంలోనే పనిచేయాలని షరతు పెడితే.... చదువు మీద మక్కువతో ఆ షరతును ఒఫ్పుకున్నాడు. మనకు స్వాతంత్ర్యం రాకముందే అంటే 1925లోనే దళిత, గిరిజన జాతులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలుండాలని ఆనాటి సైమన్ కమిషన్ కు నివేదిక ఇచ్చారంటే ఆయనకున్న ముందుచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. దళిత, గిరిజన, మహిళలందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఒక మనిషికి ఒకే ఓటు.. సమాన విలువ పేరుతో అంబానీ అయినా అడుక్కునేవాడికైనా సరే ఒకే ఓటు కల్పించిన నాయకుడు. ‘‘ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని శక్తివంతులవుతారో..... డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుని బానిసలుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది’’అని నిష్కర్షగా చెప్పిన మేధావి అంబేద్కర్. ఇయాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపేవారు చెడ్డవాళ్లయితే అది కూడా చెడిపోతుంది’’అని నిర్మొహమాటంగా చెప్పిన మహనీయుడు. అంబేద్కర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని చెరబట్టింది. వారసత్వ పాలనతో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. మహాత్మాగాంధీ విజ్ఝప్తి మేరకు స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కేబినెట్ లో చేరిన కాంగ్రెసేతర వ్యక్తులు ఇద్దరే. వారిలో అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. వీళ్లను కేబినెట్ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నా సరైన గౌరవం ఇవ్వకుండా నెహ్రూ ప్రభుత్వం 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం హిందువులకు వేర్వేరుగా అనేక వ్యక్తిగత చట్టాలుండేవి. వాటిని ఒకే చట్టంగా మార్చేందుకు 1951లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మహిళలకు సమాన ఆస్తి హక్కులు, కుటుంబ ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రతిపాదించారు. ఒకే వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మహిళలకూ విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, వివాహ బంధాన్ని చట్టపరమైన ఒప్పందంగా ఉండాలని, పిల్లలపై తల్లి హక్కులను గుర్తించాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు. వాటిని పక్కకుపెట్టి నెహ్రూ అంబేద్కర్ ను అవమానించారు. తీవ్ర మనస్థాపంతో అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తరువాత 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే.... కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అంబేద్కర్ నిలబడితే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది. చరిత్రలో అంబేద్కర్‌ ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి 2 గజాల జాగా కూడా కేటాయించలేదు(పీవీని కూడా ఇలానే అవమానించారు). చేసేదేమీలేక అంబేద్కర్ పార్ధివ దేహాన్ని ముంబై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా ఆయన భార్యకు బిల్లులను పంపించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది. ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే... 1955లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే తనకు తానుగా సిఫారసు చేసుకుని దేశ అత్యున్నతమైన భారతరత్న అవార్డు అందుకున్నారు. 1971లో ఇందిరాగాంధీ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజీవ్ గాంధీసహా కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖ నాయకులకు భారతరత్న అవార్డులిచ్చారు. కానీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంకా బాధాకరమేందంటే...అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దళిత జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని అంబేద్కర్ ధారపోస్తే.... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దశాబ్దాలపాటు సామాజిక న్యాయాన్ని దూరం చేసింది. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే.... అది బీజేపీ మాత్రమే. నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా రెండుసార్లు కాంగ్రెస్ ఓడిస్తే జన సంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసింది. బీజేపీ మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఎన్డీయే ప్రభుత్వదం ‘‘రాష్ట్రీయ సమరసత దినంగా’’ నిర్వహిస్తోంది. 2014లో మోదీగారు ప్రధాని పగ్గాలు చేపట్టి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ప్రణమిల్లి ‘చాయ్ వాలాకు ప్రధాని పదవి దక్కిందంటే...అది అంబేద్కర్ పెట్టిన భిక్షే’అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే బీజేపీ విధానమని చెప్పిన నాయకుడు మోదీ. అంబేద్కర్ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి పేరుతో పంచ తీర్ధాలుగా ప్రకటించి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెబుతున్నారు. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల చేయడమే కాకుండా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి రోజున సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించారు. బీజేపీ సిద్ధాంతాలకు, అంబేద్కర్ ఆలోచనలకు సారూప్యత ఉంది. ఆర్దిక, సామాజిక సమానత్వ + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యమనే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో చూపుతున్న మహానాయకుడు నరేంద్రమోదీ గారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో.... బ్యాంకు ముఖమే చూడని 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించిన నేరుగా సంక్షేమ పథకాల నగదులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. PMAY ద్వారా 4 కోట్ల ఇండ్లను నిర్మించారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం అందించారు. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్మించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 77 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల జమ చేశారు. ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే. వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకుని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేసినం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. పెరిగిన జనాభాను ద్రుష్టిలో పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పెంచాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచించి బిల్లును రూపొందించి అమలు చేయాలనుకుంటే అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ దే. ఈ బిల్లు అమలై ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను సరిచేయడంతోపాటు అదనంగా 50 శాతం సీట్లు పెరిగే అవకాశముండేది. ఉదాహరణకు నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాల కలెక్టర్లు, ఎంతో మంది అధికారులున్నారు. సీట్లు పెంచి ఉంటే...ఎంపీ సీట్లు పెరిగి కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. మహిళా బిల్లును అడ్డుకుని దేశ మహిళలను అవమానించింది. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమోళి, సుప్రియా సూలెకు పదవులు వస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లు. సాధారణ మహిళలకు పదవులు వస్తే వాళ్ల పునాదులు కూలిపోతాయనే భయంతోనే మహిళా బిల్లును అడ్డుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంబేద్కర్ ఆలోచనలో భాగమే. ఆనాడు అంబేద్కర్ ను ఏ విధంగా అవమానపరిచారో, అంబేద్కర్ ఆలోచన మేరకు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్న నరేంద్రమోదీని అవమానించేందుకు కుట్రలు చేస్తోంది. ఈ సందర్భంగా మేధావులను కోరేదొక్కటే. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. మీకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. అంబేద్కర్ సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి మంచిది కాదు. ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.
    3
    *మేధావులారా....డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి*
*మీ మౌనం సమాజానికి అరిష్టం*
*సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే ప్రయోజనాలను వివరించండి*
*కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి*
*మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే*
*మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసింది*
*సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమోళి, సుప్రియాలకు పదవులిస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లా?*
సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా?
కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై  మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం +  రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు. 
రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు  బస సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు వాసాల రమేశ్, గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే....
అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్... అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన  మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం. సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అంతటి మహోన్నుతుడి గురించి భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. 
నిజానికి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి?  అణగారిన వర్గాల బాధలను తెలుసుకోవడం. దళిత కులంలో పుట్టి అంటరానివాడిగా వెలివేయబడ్డా, తినడానికి తిండి లేకపోయినా ఒకపూట పస్తులుంటూ ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కుని మొక్కవోని దీక్షతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్ష్యాన్ని చేరుకుని అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించారు.  ఎక్కడో మధ్యప్రదేశ్ లోని ‘‘మౌ’’ అనే ఓ చిన్న పల్లెటూళ్లో దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ పుట్టుకతో సంపన్నుడు కాదు... కటిక పేదరికాన్ని అనుభవించాడు. గుడ్డి దీపం వెలుతురులో బతికినోడు. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం చేసేవాడు.  డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే ఫణంగా పెట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆసక్తి ఉన్న స్తోమత లేకపోవడంతో అప్పటి బరోడా మహారాజు వద్దకు పోయి సాయం కోరితే.... విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చాక 10 ఏళ్ల పాటు తన సంస్థానంలోనే పనిచేయాలని షరతు పెడితే.... చదువు మీద మక్కువతో ఆ షరతును ఒఫ్పుకున్నాడు.
మనకు స్వాతంత్ర్యం రాకముందే అంటే 1925లోనే దళిత, గిరిజన జాతులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలుండాలని ఆనాటి సైమన్ కమిషన్ కు నివేదిక ఇచ్చారంటే ఆయనకున్న ముందుచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. దళిత, గిరిజన, మహిళలందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఒక మనిషికి ఒకే ఓటు.. సమాన విలువ పేరుతో అంబానీ అయినా అడుక్కునేవాడికైనా సరే ఒకే ఓటు కల్పించిన నాయకుడు. ‘‘ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని శక్తివంతులవుతారో..... డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుని బానిసలుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది’’అని నిష్కర్షగా చెప్పిన మేధావి అంబేద్కర్. ఇయాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపేవారు చెడ్డవాళ్లయితే అది కూడా చెడిపోతుంది’’అని నిర్మొహమాటంగా చెప్పిన మహనీయుడు. 
అంబేద్కర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని చెరబట్టింది. వారసత్వ పాలనతో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. మహాత్మాగాంధీ విజ్ఝప్తి మేరకు స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కేబినెట్ లో చేరిన కాంగ్రెసేతర వ్యక్తులు ఇద్దరే. వారిలో అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. వీళ్లను కేబినెట్ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. 
జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నా సరైన గౌరవం ఇవ్వకుండా నెహ్రూ ప్రభుత్వం 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం హిందువులకు వేర్వేరుగా అనేక వ్యక్తిగత చట్టాలుండేవి. వాటిని ఒకే చట్టంగా మార్చేందుకు 1951లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మహిళలకు సమాన ఆస్తి హక్కులు, కుటుంబ ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రతిపాదించారు. ఒకే వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మహిళలకూ విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, వివాహ బంధాన్ని చట్టపరమైన ఒప్పందంగా ఉండాలని, పిల్లలపై తల్లి హక్కులను గుర్తించాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు.  వాటిని పక్కకుపెట్టి నెహ్రూ అంబేద్కర్ ను అవమానించారు. తీవ్ర మనస్థాపంతో అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
ఆ తరువాత 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే.... కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అంబేద్కర్ నిలబడితే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది. చరిత్రలో అంబేద్కర్‌ ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి 2 గజాల జాగా కూడా కేటాయించలేదు(పీవీని కూడా ఇలానే అవమానించారు). చేసేదేమీలేక అంబేద్కర్ పార్ధివ దేహాన్ని ముంబై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా ఆయన భార్యకు బిల్లులను పంపించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది.  
ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే... 1955లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే తనకు తానుగా సిఫారసు చేసుకుని దేశ అత్యున్నతమైన భారతరత్న అవార్డు అందుకున్నారు. 1971లో ఇందిరాగాంధీ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజీవ్ గాంధీసహా కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖ నాయకులకు భారతరత్న అవార్డులిచ్చారు. కానీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంకా బాధాకరమేందంటే...అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దళిత జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని అంబేద్కర్ ధారపోస్తే.... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దశాబ్దాలపాటు సామాజిక న్యాయాన్ని దూరం చేసింది. 
అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే.... అది బీజేపీ మాత్రమే. నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా రెండుసార్లు కాంగ్రెస్ ఓడిస్తే జన సంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసింది. బీజేపీ మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఎన్డీయే ప్రభుత్వదం ‘‘రాష్ట్రీయ సమరసత దినంగా’’ నిర్వహిస్తోంది. 
2014లో మోదీగారు ప్రధాని పగ్గాలు చేపట్టి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ప్రణమిల్లి ‘చాయ్ వాలాకు ప్రధాని పదవి దక్కిందంటే...అది అంబేద్కర్ పెట్టిన భిక్షే’అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే బీజేపీ విధానమని చెప్పిన నాయకుడు మోదీ. అంబేద్కర్ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి పేరుతో పంచ తీర్ధాలుగా ప్రకటించి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెబుతున్నారు. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల చేయడమే కాకుండా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి రోజున సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించారు.
బీజేపీ సిద్ధాంతాలకు, అంబేద్కర్ ఆలోచనలకు సారూప్యత ఉంది. ఆర్దిక, సామాజిక సమానత్వ +  రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యమనే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో చూపుతున్న మహానాయకుడు నరేంద్రమోదీ గారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో.... బ్యాంకు ముఖమే చూడని 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించిన నేరుగా సంక్షేమ పథకాల నగదులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. PMAY ద్వారా 4 కోట్ల ఇండ్లను నిర్మించారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం అందించారు. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్మించారు.  ఆయుష్మాన్ భారత్ పథకం కింద 77 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల జమ చేశారు.
ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే. వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకుని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేసినం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. పెరిగిన జనాభాను ద్రుష్టిలో పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పెంచాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచించి బిల్లును రూపొందించి అమలు చేయాలనుకుంటే అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ దే. 
ఈ బిల్లు అమలై ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను సరిచేయడంతోపాటు అదనంగా 50 శాతం సీట్లు పెరిగే అవకాశముండేది. ఉదాహరణకు నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాల కలెక్టర్లు, ఎంతో మంది అధికారులున్నారు. సీట్లు పెంచి ఉంటే...ఎంపీ సీట్లు పెరిగి కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. మహిళా బిల్లును అడ్డుకుని దేశ మహిళలను అవమానించింది. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమోళి, సుప్రియా సూలెకు పదవులు వస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లు. సాధారణ మహిళలకు పదవులు వస్తే వాళ్ల పునాదులు కూలిపోతాయనే భయంతోనే మహిళా బిల్లును అడ్డుకుంటోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంబేద్కర్ ఆలోచనలో భాగమే. ఆనాడు అంబేద్కర్ ను ఏ విధంగా అవమానపరిచారో, అంబేద్కర్ ఆలోచన మేరకు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్న నరేంద్రమోదీని అవమానించేందుకు కుట్రలు చేస్తోంది.
ఈ సందర్భంగా మేధావులను కోరేదొక్కటే. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. మీకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. అంబేద్కర్ సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి మంచిది కాదు. ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.