logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోర్టు వాహనాలతో ఇబ్బంది. పోలీసులకు ఫిర్యాదు. సంతబొమ్మాళి, జనవరి 12, సంతబొమ్మాళిమండలంలో నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుండి పాలనాయుడుపేట వరకు మూలపేట పోర్టు వాహనాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని మాజీ ఎంపీపీ ప్రతినిధి, కర్రి విష్ణుమూర్తి అన్నారు. దీనిపై నౌపడ పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై నారాయణస్వామి కి సోమవారం వినతి పత్రం అందించారు. రోడ్డు మొత్తం గోతులమయం కావడంతో పాటు రోడ్డుపై మట్టి పేరుకు పోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయని ,తరచూ వాహనాలు పాడవుతున్నాయని అన్నారు. ఇటీవల ఈ రోడ్డుపై ప్రమాదాలు కూడా జరిగాయని ఎస్సై దృష్టికి తెచ్చారు. దీంతోపాటు పోర్టు వాహనాలతో దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులనుఎదుర్కొంటున్నామనితెలిపారు.పోర్టుయాజమాన్యంతో చర్చించి రోడ్డు మరమ్మత్తులు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు సుగ్గు నాగిరెడ్డి, దల్లి రాజు, సుబ్బారావు ఉన్నారు.

2 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
Journalist సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
2025e8a7-a99d-4b7b-97a7-10ecfff3224d

పోర్టు వాహనాలతో ఇబ్బంది. పోలీసులకు ఫిర్యాదు. సంతబొమ్మాళి, జనవరి 12, సంతబొమ్మాళిమండలంలో నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుండి పాలనాయుడుపేట వరకు మూలపేట పోర్టు వాహనాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని మాజీ ఎంపీపీ ప్రతినిధి, కర్రి విష్ణుమూర్తి అన్నారు. దీనిపై నౌపడ పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై నారాయణస్వామి కి సోమవారం వినతి పత్రం అందించారు. రోడ్డు మొత్తం గోతులమయం కావడంతో పాటు రోడ్డుపై మట్టి పేరుకు పోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయని ,తరచూ వాహనాలు పాడవుతున్నాయని అన్నారు. ఇటీవల ఈ రోడ్డుపై ప్రమాదాలు కూడా జరిగాయని ఎస్సై దృష్టికి తెచ్చారు. దీంతోపాటు పోర్టు వాహనాలతో దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులనుఎదుర్కొంటున్నామనితెలిపారు.పోర్టుయాజమాన్యంతో చర్చించి రోడ్డు మరమ్మత్తులు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు సుగ్గు నాగిరెడ్డి, దల్లి రాజు, సుబ్బారావు ఉన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది' ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
    1
    ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది'
ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • "మన వరప్రసాద్ "ఆనంద క్షణాలు... ఒక విజయం అనిల్ రావిపూడిని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది..! .....
    1
    "మన వరప్రసాద్ "ఆనంద క్షణాలు...
ఒక విజయం అనిల్ రావిపూడిని దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయం చిరంజీవికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది..!
.....
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Journalist Palakonda, Parvathipuram Manyam•
    56 min ago
  • మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    1
    మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్
    1
    కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*
    1
    *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*
    user_Nandikolla Raju
    Nandikolla Raju
    Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    1
    వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత  పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    12 min ago
  • ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఈనెల 18న ఖమ్మం లో జరిగే సి.పి.ఐ శతవసంతాల ఉత్సావాన్ని జయప్రదం చేయండి.
భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు పాలకొండలోని పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మన్మధ రావు మాట్లాడుతూ 1935 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని ఆనాటి నుండి నేటి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి ప్రాణార్పణలు చేస్తూ నిర్బంధాలను ఎదుర్కొంటూ లక్షలాది ఎకరాలు భూ పంపిణీతో పాటు అనేక ఉద్యమాలు చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేయడం ఒక కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైందని ఆయన తెలిపారు. పార్టీ పాలకొండ నియోజకవర్గం బాధ్యులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పార్టీ అకుంఠ దీక్షతో సకల జనుల సమస్యలపై ముందుండి ఉద్యమము నడిపిన ఘనత ఒక్క సిపిఐ కి మాత్రమే దక్కుతుందని ఆనాటి త్యాగధనులు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీన ఖమ్మం పట్నంలో లక్షలాది మందితో జరగబోతున్న కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పాలకొండ పట్టణ లో ప్రముఖ న్యాయవాది పార్టీ సీనియర్ కామ్రేడ్ ఉత్తరావల్లిమురళీమోహన్ మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే పౌర హక్కులకు భంగం కలుగు తుందని,ప్రభుత్వ రంగ సంస్థ లను,ఆస్తులను కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడు తున్నారని యువతరానికి ఉపాధి లేక భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న 100 సంవత్సరాల వసంతోత్సవంలో ప్రజలు పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూరంగి గోపినాయుడు,మండంగి సింగన్న, తోయిక పొత్తు తదితరులు పాల్గొన్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Journalist పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.