మచిలీపట్నం డీఎంహెచ్వో సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో అగ్నిప్రమాదం.. ఎక్స్పైర్డ్ మందుల గదిలో మంటలు మచిలీపట్నం: కృష్ణాజిల్లా డీఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ నెం.1లో నిల్వ ఉంచిన ఎక్స్పైర్డ్ మందుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది నుంచి భారీగా పొగలు రావడాన్ని గుర్తించిన సెంట్రల్ మెడిసినల్ స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ఇన్చార్జి చిన్నారావు వివరాలు వెల్లడించారు.
మచిలీపట్నం డీఎంహెచ్వో సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో అగ్నిప్రమాదం.. ఎక్స్పైర్డ్ మందుల గదిలో మంటలు మచిలీపట్నం: కృష్ణాజిల్లా డీఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ నెం.1లో నిల్వ ఉంచిన ఎక్స్పైర్డ్ మందుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది నుంచి భారీగా పొగలు రావడాన్ని గుర్తించిన సెంట్రల్ మెడిసినల్ స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ఇన్చార్జి చిన్నారావు వివరాలు వెల్లడించారు.
- మచిలీపట్నం డీఎంహెచ్వో సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో అగ్నిప్రమాదం.. ఎక్స్పైర్డ్ మందుల గదిలో మంటలు మచిలీపట్నం: కృష్ణాజిల్లా డీఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ నెం.1లో నిల్వ ఉంచిన ఎక్స్పైర్డ్ మందుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది నుంచి భారీగా పొగలు రావడాన్ని గుర్తించిన సెంట్రల్ మెడిసినల్ స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ఇన్చార్జి చిన్నారావు వివరాలు వెల్లడించారు.2
- కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం మానుకోవాలి. ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు: మాజీ మంత్రి అంబటి SHOT NEWS: ముస్తఫా ఏలాంటీ వారో గుంటూరు ప్రజలందరికి తెలుసు ఆయన మీద కూడ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్న కూటమీ ప్రభుత్వం ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తుందీ అని అంబటి రాంబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు అని ఆయన అన్నారు.1
- అచ్చంపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు. . అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బరువులో తేడాలున్న నిత్యవసర వస్తువులను గుర్తించి షాపు యాజమానులకు అపరాధ రుసుము విధించారు. ప్రతి కొనుగోలుదారునికి తప్పుకుండా బిల్లు ఇవ్వాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, కొలతలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులు వ్యాపారులను ఆదేశించారు. లీగల్ కండోమ్ రైట్స్ స్టేట్ మెంబర్ రాంబాబు అధికారులు పాల్గొన్నారు.3
- సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.1
- 100 మంది కి రాహుల్ గాంధీని కలిసే అవకాశం బిఎల్ఏ సమావేశం ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లిలో నిర్వహించిన బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ... సర్' కార్యక్రమం ఏమీ ఆశామాషీ వ్యవహారం కాదని, పార్టీ బలోపేతానికి ఇది అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఒక్క ఓటు తేడాతో ఎంతోమంది భవితవ్యాలు మారాయని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్క ఓటునూ కాపాడుకోవాల్సిన బాధ్యత బిఎల్ఏలపైనే ఉందన్నారు. జిల్లాలో 90 శాతం పని పూర్తయి రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్న ఎమ్మెల్యే, ఇంకా మిగిలి ఉన్న 23 వేల ఓట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లిన వారిని కూడా ఫోన్ల ద్వారా సంప్రదించి ఫారమ్లు నింపాలని సూచించారు. బిఎల్ఓ లతో కలిసి పనిచేస్తూ ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఓటు పోతే రాజ్యాంగం ఇచ్చిన హక్కు కోల్పోయినట్లే అన్నారు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలైన ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి వివరించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, ప్రతిభ కనబరిచే మొదటి 100 మంది బిఎల్ఏలకు రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అరుదైన అవకాశం దక్కుతుందని తెలిపారు. ఇంతవరకు తనకు రాహుల్ గాంధీని కలిసే అవకాశం రాలేదని గుర్తు చేశారు దేశంలో విద్యార్థుల పోరాటం ఫలించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.1
- ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.4
- మూలపాడులో "బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే" కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే వసంత. విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం – 118 మందికి రూ.6.20 లక్షల పంపిణీ ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జులై,29, భారత్ న్యూస్.. ఇబ్రహీంపట్నం మండలంమూలపాడు గ్రామంలో బటర్ఫ్లై పార్కులో "బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే" కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగాఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం – 118 మందికి రూ.6.20 లక్షల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వగ్రామమైన మూలపాడు లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. మూలపాడు బటర్ఫ్లై నగరవనంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. 35 ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన 118 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత. విద్యకు కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వ్యాఖ్య నించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని వెల్లడిస్తూ ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ' బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు చేరుకున్నాయని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు, తల్లికి వందనం వంటి పథకాలు పేద కుటుంబాలకు వరమని వ్యాఖ్య నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతి ఏడాది ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే హామీ. ప్రకృతిని ప్రేమించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ విద్యార్థులకు పిలుపు ఎమ్మెల్యే పిలుపుతో నగరవనంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరి పరిశుభ్రతకు విద్యార్థుల సహకారం అన్న ఎన్టీఆర్, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు,కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు.4
- ప్రజా ప్రెస్ క్లబ్ ప్రోద్బలం ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు భారత్ న్యూస్, పత్రిక వార్త కథనానికి స్పందించిన 108 సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జులై, 29, ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళు జాతీయ రహదారిలో బస్ స్టాప్ లో గత కొద్ది రోజులుగా ఒక వృద్ధుడు అనాధగా కాలికి గాయమై కాలికి చీ మీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు అంతా తినేసి దుర్వాసన కొడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించిన ప్రజాప్రస్ క్లబ్ పత్రికా మిత్రులు స్పందించి వారి వార్త కథనంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పి వెంకట శివ, సురేష్ గోపి లు మానవతాదృక్పథంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వచ్చినట్టు సమాచారం. పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలాంటి సమస్యలపై మరింత మీరు సేవ చేయాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.1