logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*_ముగ్గురు IAS లను పెళ్లి చేసుకున్న IAS అధికారి.._* ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్కా ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు.వయసు పైబడుతున్నా..వెంట్రుకలు మెరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాద్‌లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు.ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం.ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు.ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి.ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు.ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు.కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరింది.ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు.ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్నారు.గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

6 hrs ago
user_Ramesh Solanki
Ramesh Solanki
स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
6 hrs ago

*_ముగ్గురు IAS లను పెళ్లి చేసుకున్న IAS అధికారి.._* ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్కా ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు.వయసు పైబడుతున్నా..వెంట్రుకలు మెరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాద్‌లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు.ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం.ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు.ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి.ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు.ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు.కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరింది.ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు.ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్నారు.గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 min ago
  • ​ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు మంచిర్యాల జిల్లా లోని ​క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా? క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం. ​బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా? ​పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో! ​ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్‌ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు
    1
    ​ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు
మంచిర్యాల జిల్లా లోని ​క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా?
క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం.
​బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా?
​పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో!
​ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్‌ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    6 hrs ago
  • కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో  మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి  శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • అస్తాం విజయ గర్జన ర్యాలీ ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు
    1
    అస్తాం విజయ గర్జన ర్యాలీ 
ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.