*అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాండ్ ఓపెనింగ్* *ఇబ్రహీంపట్నం, మార్చి 14, (గళమ్ న్యూస్)* ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ రోడ్ లో గల భారతీయ స్టేట్ బ్యాంక్ వెనుక నూతనంగా స్థాపించబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాండ్ ఓపెనింగ్ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ సూపర్ ఏంటెండెంట్ ఏ సత్యవతిచే జ్యోతి ప్రజ్వలన గావించడం అయినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రమణ్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు 14వ వార్డ్ కౌన్సిలర్ చనుమోలు నారాయణ రాయల్ బ్రిలియంట్ స్కూల్ అధినేత నిడుముక్కల శివశంకరరావు తదితరులు హాజరై అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవంగల అధ్యాపకులు అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ ఏ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులకు అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా గావించబడి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు నాంది అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరీ నుండి సిక్స్త్ క్లాస్ వరకు సీబీఎస్ఈ కారిక్యులం లో విద్యాబోధన సుధీర్గ అనుభవం గల అధ్యాపకులచే ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్షర విద్యార్థుల కోసం మొదటి ఏడాది సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది ఇబ్రహీంపట్నం గుంటుపల్లి కేతనకొండ వరకు విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనదని సంస్థ వ్యవస్థాపకులు ఏ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.*అక్షర విద్యార్థుల కోసం మేము ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులు* క్రికెట్ చెస్ టైక్వాండో చిన్నారుల కోసం స్విమ్మింగ్ పూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిక్స్త్ క్లాస్ విద్యార్థులకు నీట్ ఐఐటి లలో ప్రత్యేక శిక్షణ లక్ష్యం అన్నారు.
*అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాండ్ ఓపెనింగ్* *ఇబ్రహీంపట్నం, మార్చి 14, (గళమ్ న్యూస్)* ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ రోడ్ లో గల భారతీయ స్టేట్ బ్యాంక్ వెనుక నూతనంగా స్థాపించబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాండ్ ఓపెనింగ్ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ సూపర్ ఏంటెండెంట్ ఏ సత్యవతిచే జ్యోతి ప్రజ్వలన గావించడం అయినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రమణ్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు 14వ వార్డ్ కౌన్సిలర్ చనుమోలు నారాయణ రాయల్ బ్రిలియంట్ స్కూల్ అధినేత నిడుముక్కల శివశంకరరావు తదితరులు హాజరై అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవంగల అధ్యాపకులు అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ ఏ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నారులకు అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా గావించబడి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు నాంది అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరీ నుండి సిక్స్త్ క్లాస్ వరకు సీబీఎస్ఈ కారిక్యులం లో విద్యాబోధన సుధీర్గ అనుభవం గల అధ్యాపకులచే ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయబడిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్షర విద్యార్థుల కోసం మొదటి ఏడాది సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది ఇబ్రహీంపట్నం గుంటుపల్లి కేతనకొండ వరకు విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనదని సంస్థ వ్యవస్థాపకులు ఏ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.*అక్షర విద్యార్థుల కోసం మేము ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులు* క్రికెట్ చెస్ టైక్వాండో చిన్నారుల కోసం స్విమ్మింగ్ పూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిక్స్త్ క్లాస్ విద్యార్థులకు నీట్ ఐఐటి లలో ప్రత్యేక శిక్షణ లక్ష్యం అన్నారు.
- యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- Post by V Ramarao3
- మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆవేదన: తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారుల స్పందన: ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- Post by Ippili tulasi1
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1