Shuru
Apke Nagar Ki App…
తాగునీరు సౌకర్యం కల్పించండి సారు........................ డుంబ్రిగూడ మండలం పరిధిలోని పోతంగి పంచాయతీలోని ఒంతోడ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం గ్రామానికి వచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప, సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
Nava surya
తాగునీరు సౌకర్యం కల్పించండి సారు........................ డుంబ్రిగూడ మండలం పరిధిలోని పోతంగి పంచాయతీలోని ఒంతోడ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం గ్రామానికి వచ్చి హామీలు ఇస్తున్నారు తప్ప, సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరుకానున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల సమయంలో అరకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.1
- Post by Shyam1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- ఒరిస్సా సరిహద్దు నుంచి వచ్చిన మరో ఏనుగు1
- చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం పాలకొండలోని కోటదుర్గ అమ్మ వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకుడు లక్ష్మీప్రసాదుశర్మ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుందన్నారు. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి పూజలనంతరం ఆలయాన్ని మూసివేసి బుధవారం ఉదయం 6 గంటలకు తెరుస్తామని పేర్కొన్నారు.1
- సారవకోట: సారవకోట మండలం అలుదు ప్రధాన రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర, అప్పలనాయుడు పెళ్లి పిలుపునకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన నరేంద్రను నరసన్నపేట ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పలనాయుడు, ఆటోలో ప్రయాణిస్తున్న వరలక్ష్మిలకు గాయాలయ్యాయి.1
- ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.1