Shuru
Apke Nagar Ki App…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.
Sangareddy News
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.
More news from Hyderabad and nearby areas
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.1
- బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.1
- हैदराबाद में अभी दवा कर पानी गिर रहा है मौसम बहुत अच्छा है बारिश हैदराबाद में गिर रहा है वह पानी किसानों के खेतों में गिरे तो उसकी फसल हो जाएगा मगर जहां पर पानी गिरना वहां नहीं पड़ रहा है1
- సికింద్రాబాద్లో అద్భుత సందడి: లష్కర్ బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి వేలాది మంది భక్తులు చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. ఘనమైన బోనాల వేడుకలు సికింద్రాబాద్లో అద్భుత సందడి: లష్కర్ బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి వేలాది మంది భక్తులు చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు: సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, వేప ఆకులు, పసుపుతో అలంకరించిన ఇత్తడి మరియు మట్టి కుండలను, వెలిగించిన దీపాలను తలపై మోస్తున్నారు. విఐపిలు & అధికారులు ప్రార్థనలు: తెలంగాణ ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి నాయకులు మరియు మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పోతరాజుల సందడి: రంగురంగుల పోతరాజులు దైవ ఊరేగింపులకు నాయకత్వం వహిస్తూ నృత్యం చేస్తుండగా, లయబద్ధమైన డప్పుల మోతలు (తప్పేట గుళు) వీధులన్నీ మారుమోగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మరియు ట్రాఫిక్ మళ్లింపులు: భారీ జనసమూహాలను సజావుగా నియంత్రించడానికి 2,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని, సీసీటీవీ నిఘాను మరియు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. రంగం జోస్యంపై అందరి దృష్టి: రెండవ రోజున మట్టి కుండపై నిలబడి ఒక పూజారిణి చెప్పే సాంప్రదాయ వార్షిక జోస్యం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి వెల్దుర్తి గ్రామంలో మంజూరైన 72 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామపంచాయతీ ఈవో కృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు ఇళ్లు పూర్తికాగా, వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. మరో 23 ఇళ్లు లింటెల్ దశకు చేరుకోవడంతో ఆ దశకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదనంగా 42 ఇళ్లలో బేస్మెంట్, గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈవో కృష్ణ తెలిపారు.1
- రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందింది : రైతు మునోత్ రవి పెద్ద శంకరంపేట మండలంలోని గట్టుకింది తాండాకు చెందిన రైతు మునోత్ రవి తన రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్ర సిబ్బంది ఆవుకు నాలుగు ఇంజక్షన్లు ఇచ్చిన గంటలోపే అది చనిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు, పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే అనుమతి లేకుండా చికిత్స చేసినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. స్థానికులు ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను డీసీఎం వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెపట్టారు. అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.1