Shuru
Apke Nagar Ki App…
భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. స్థానికులు ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను డీసీఎం వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెపట్టారు. అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
P.srinu
భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. స్థానికులు ఆందోళన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను డీసీఎం వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెపట్టారు. అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
More news from తెలంగాణ and nearby areas
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్లో వరంగల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్రావును అభినందించారు.1
- రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందింది : రైతు మునోత్ రవి పెద్ద శంకరంపేట మండలంలోని గట్టుకింది తాండాకు చెందిన రైతు మునోత్ రవి తన రూ.40 వేల విలువైన ఆవు చికిత్స అనంతరం మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్ర సిబ్బంది ఆవుకు నాలుగు ఇంజక్షన్లు ఇచ్చిన గంటలోపే అది చనిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు, పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే అనుమతి లేకుండా చికిత్స చేసినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- బెజ్జంకిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలు ...... బెజ్జంకిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా ఆషాఢ మాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి పారవశ్యంతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నామని సంఘాల ప్రతినిధులు తెలిపారు.4
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని ఆషాడ మాసం ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- జర్నలిస్టుపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసినా కూడా యజమాన్యులు ప్రశ్నించే దృష్టితో ఏర్పడింది :మాజీ మంత్రి కేటీఆర్ వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది. – కేటీఆర్1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు. గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.2
- కరీంనగర్ జిల్లాలో ఫ్రెండ్ షిప్ డే విషాదం...మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కరీంనగర్ జిల్లాలో స్నేహితుల దినోత్సవం విషాదంగా మారింది. స్నేహితులతో ఆడిపాడిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళి రెండు చోట్ల ఇద్దరు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం పరిధిలో ఎల్ఎండి రిజర్వాయర్ లో స్నేహితులతో కలిసి అలుగునూర్ కు చెందిన గోల్కొండ మణిప్రసాద్(23) ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అటు శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన 8 ఏళ్ళ బాలుడు రీత్విక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2