Shuru
Apke Nagar Ki App…
అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్లో వరంగల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్రావును అభినందించారు.
M D Azizuddin
అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్లో వరంగల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్రావును అభినందించారు.
More news from తెలంగాణ and nearby areas
- అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్లో వరంగల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్రావును అభినందించారు.1
- .మహబూబాబాద్ జిల్లా: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు మహబూబాబాద్ పోలీసుల అండ.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, "మీపై కేసు నమోదైంది.. మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాం" అంటూ బెదిరించి, భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నేరగాళ్ల లావాదేవీలను గుర్తించి, బాధితులు కోల్పోయిన నగదును రికవరీ చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ అనుభవాన్ని వివరించారు. పోలీసులమని చెప్పి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో తీవ్రంగా బెదిరించారని, భయంతో వారు చెప్పినట్లే డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పోలీసులు వేగంగా స్పందించి తమ డబ్బులు తిరిగి ఇప్పించారని, జిల్లా ఎస్పీ శబరిష్, డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా వెంటనే నమ్మవద్దని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.1
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లస్కర్ బోనాల జాతర హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకొని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన నివాసంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరియు సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, కొండా సురేఖ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది.1
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్య సిబ్బంది కొరత, ఎంఆర్ఐ స్కాన్ సేవలు లేకపోవడం, రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిని రిఫరల్ సెంటర్గా మార్చేశారని విమర్శిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ప్రియ స్నేహితులారా ప్రభువు నామానికి శుభములు మీ జీవితాన్ని నడిపించే దేవుడు బలపరిచే దేవుడు కాపాడే దేవుడు జీవించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు1