Shuru
Apke Nagar Ki App…
ప్రియ స్నేహితులారా ప్రభువు నామానికి శుభములు మీ జీవితాన్ని నడిపించే దేవుడు బలపరిచే దేవుడు కాపాడే దేవుడు జీవించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు
T. Raja simha
ప్రియ స్నేహితులారా ప్రభువు నామానికి శుభములు మీ జీవితాన్ని నడిపించే దేవుడు బలపరిచే దేవుడు కాపాడే దేవుడు జీవించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు
More news from తెలంగాణ and nearby areas
- అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్లో వరంగల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్రావును అభినందించారు.1
- బోనాల పండుగ సందర్భంగా......బోనాల విందులో సీఎం రేవంత్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు.1
- .మహబూబాబాద్ జిల్లా: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు మహబూబాబాద్ పోలీసుల అండ.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, "మీపై కేసు నమోదైంది.. మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాం" అంటూ బెదిరించి, భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నేరగాళ్ల లావాదేవీలను గుర్తించి, బాధితులు కోల్పోయిన నగదును రికవరీ చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ అనుభవాన్ని వివరించారు. పోలీసులమని చెప్పి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో తీవ్రంగా బెదిరించారని, భయంతో వారు చెప్పినట్లే డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పోలీసులు వేగంగా స్పందించి తమ డబ్బులు తిరిగి ఇప్పించారని, జిల్లా ఎస్పీ శబరిష్, డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా వెంటనే నమ్మవద్దని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.1
- సమాజిక సేవతోనే సంఘం బలోపేతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు కరీంనగర్ లోని ఓ వేడుక మందిరం. లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సర్వతోముఖాభివృద్ధికి, బలోపేతం కోసం నూతన కమిటీ సభ్యులు ఐక్యమత్యంతో అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్ట పురుషోత్తం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ఆకుల నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.2
- కరీంనగర్ లో కన్నుల పండువగా పోచమ్మ తల్లి బోనాల వేడుకలు.. స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్ల హరి శంకర్, 40 వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్య సిబ్బంది కొరత, ఎంఆర్ఐ స్కాన్ సేవలు లేకపోవడం, రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిని రిఫరల్ సెంటర్గా మార్చేశారని విమర్శిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ప్రియ స్నేహితులారా ప్రభువు నామానికి శుభములు మీ జీవితాన్ని నడిపించే దేవుడు బలపరిచే దేవుడు కాపాడే దేవుడు జీవించే దేవుడు ప్రభువు యేసుక్రీస్తు1