పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని గౌరవపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఆకుల గజేంద్ర పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు రోజుల క్రితం నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో ఆయన చేరారు. దీంతో మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మరియు కూటమి నేతలను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయంగా తొలి గురువు అమర్నాథ్ రెడ్డి అని వారి కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు నచ్చే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు తగిన గౌరవం గుర్తింపు లేని కారణంగానే వైకాపాను వీడియానని ఇక తన జీవితాంతం జనసేనలోనే కొనసాగుతూ ప్రజాసేవలో రాణిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్ లతోపాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని గౌరవపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఆకుల గజేంద్ర పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు రోజుల క్రితం నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో ఆయన చేరారు. దీంతో మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మరియు కూటమి నేతలను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయంగా తొలి గురువు అమర్నాథ్ రెడ్డి అని వారి కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు నచ్చే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు తగిన గౌరవం గుర్తింపు లేని కారణంగానే వైకాపాను వీడియానని ఇక తన జీవితాంతం జనసేనలోనే కొనసాగుతూ ప్రజాసేవలో రాణిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్ లతోపాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.
- పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు రోజుల క్రితం నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో ఆయన చేరారు. దీంతో మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మరియు కూటమి నేతలను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయంగా తొలి గురువు అమర్నాథ్ రెడ్డి అని వారి కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు నచ్చే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు తగిన గౌరవం గుర్తింపు లేని కారణంగానే వైకాపాను వీడియానని ఇక తన జీవితాంతం జనసేనలోనే కొనసాగుతూ ప్రజాసేవలో రాణిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్ లతోపాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.1
- *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది. ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.1
- కర్ణాటకలో ప్రజలను ఆకట్టుకుంటున్న దృశ్యం. ఈ చిత్రంలో, భారతదేశంలోని కర్ణాటకలో ప్రతిరోజూ ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలి మరణం పట్ల ఒక కోతి దుఃఖిస్తున్న తెలుగు వైరల్ కథ ఉంది.* తనకు రోజూ ఆహారం పెట్టే మహిళ మరణించడంతో ఒక కోతి తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటన కర్ణాటకలోని చన్నపట్నలో జరిగింది. కోతి ఆ స్త్రీ శరీరాన్ని హత్తుకుని, వదిలి వెళ్ళడానికి నిరాకరించింది••1
- బ్యాంక్లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్ హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.1
- తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం. తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.1
- కోవూరు మండలం లేకుంటపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సామాజిక పింఛన్ల పంపిణీ, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అలాగే ఈ గ్రామంలో అభివృద్ధి చేసే నాయకులు ఉన్నారని అలాగే గ్రామంలో లేకుండా చూస్తున్నారు. శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టి వదిలేయడం కాదు శంకుస్థాపన చేసిన అక్కడ నుంచి అది అయ్యింది దాకా చెయ్యాలని దాన్ని వదిలేయటం కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.4
- 1/4/26 బుధవారము పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. పెద్దపంజాణి ఎగువ మిద్దపల్లికు చెందిన చంద్రమ్మగా గుర్తించిన పోలీసులు. సోమవారం చంద్రమ్మ మిస్సింగ్ అంటూ పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు. అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుతో బైక్ పై వెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం ను విచారించగా వెలుగులోకి వచ్చిన ఘటన. 15 సంవత్సరాల క్రితం వీకోట మండలం నాగిరెడ్డిపల్లి చలపతి అనే అతనితో వివాహం కుటుంబ కలహాలతో ఆరు సంవత్సరాల క్రితం విడిపోయిన భార్య భర్తలు టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న చంద్రమ్మ. చంద్రమ్మను హత్య చేసిన సుబ్రహ్మణ్యం తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమేయం ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది1