_ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్గా మొదలై గంజాయి బిజినెస్గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...
_ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ _ఆంధ్ర–ఒడిశా బోర్డర్ నుంచి నల్గొండకు గంజాయి సప్లై చేస్తున్న గాంజా గ్యాంగ్ అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీస్ పోలీసుల సడెన్ రైడ్తో 5 మంది గ్యాంగ్ సభ్యులు అరెస్ట్.. వారి వద్ద నుంచి సుమారు 3 లక్షలు విలువ చేసే 5 కిలోల గంజాయి సీజ్ ,రెండు పల్సర్ బైకులు, 5 మొబైల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం... ఉడిపి హోటల్ దగ్గర గుట్టుగా డీల్ చేస్తూ చిక్కిన యువకులు... *పారిపోదాం అనుకున్నారు..* ప్లాన్ ఫెయిల్ – వెంటనే పట్టేసిన టూ టౌన్ పోలీసులు... ఒక్క కేజీ 3 వేలకే కొనుగోలు చేసి నల్గొండలో భారీ రేటుకు అమ్మకం... ఫ్రెండ్స్ గ్యాంగ్గా మొదలై గంజాయి బిజినెస్గా మారిన కథ... ఇంకా 6 మంది పరారీలో – పోలీసుల వేట కొనసాగుతోంది... గంజాయి అంటే జైలు టికెట్ ఖాయం.. అంటూ *అడిషనల్ ఎస్పీ జి రమేష్* స్ట్రాంగ్ వార్నింగ్... నలగొండ డిఎస్పి శివరాం రెడ్డి నేతృత్వంలో టూ టౌన్ సీఐ S.రాఘవ రావు,ఆద్వర్యంలో ఎస్సై వై.సైదులు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పి.రాజు,మరియు కానిస్టేబుల్ L.బాలకోటి,MD.షకీల్ లతో లను జిల్లా S.P అభినందించనైనది...
- వరంగల్: అర్హులైన పేదలకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ శివనగర్లో నిర్వహించిన వరంగల్ తూర్పు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 421 మంది లబ్ధిదారులకు రూ. 4.21 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 2,422 మంది చేనేత కార్మికులకు రూ. 78.52 లక్షల ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. అలాగే 248 మంది మైనార్టీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.1
- గజ్వేల్ పట్టణంలో మే డే సందర్భంగా లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు ఎండీ కరీం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు పి. ఆంజనేయులు, ఎస్.కె ఫరీద్, కోశాధికారి ఆర్. దయాకర్, సభ్యులు ఎండీ యూసుఫ్, రాజు చారి, విజయ్, దుర్గేష్, సోహెల్, బాలేష్, సోను, పాషా, స్వామి, వెంకటేష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆటో డ్రైవర్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై మే డే ప్రాముఖ్యతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- Post by Sandepogu joji1
- తీవ్ర సూర్యరశ్మి కారణంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఎలక్ట్రిక్ డీపీ (పెట్టె)లు అధిక వేడిని సంతరించుకుంటున్నాయి. దీనివల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలను నిలపకుండా, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.1
- హన్మకొండ జిల్లా వేలేరు మండలం చింతల తండాలో గడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. గడ్డి కట్టలు అనుకోకుండా విద్యుత్ తీగలను తాకడంతో ట్రాక్టర్ డబ్బా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రైతు మలోతు జైపాల్కు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ట్రాక్టర్ పూర్తిగా కాలిపోవడంతో జీవనాధారమైన వాహనం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త దుబకుంట లక్ష్మణ్ సౌజన్యంతో పెరుగన్నం,పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి,దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మరో గాగిలాపూర్ దత్తాత్రేయ క్షేత్రంగా గజ్వేల్ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతుందని,అన్నారు ప్రతి పౌర్ణమి రోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, పౌర్ణమి రోజున పెరుగన్నం దానం చేస్తే మహా పుణ్యం లభిస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బొగ్గుల చందు,దుబాకుంట లక్ష్మణ్, కైలాస ప్రశాంత్,ఉప్పల చంద్ర శేఖర్,భక్తులు తదితరులు పాల్గొన్నారు4
- గురజాల సొసైటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. రైతులు పండించిన మక్కలకు సరైన ధర లభించడం లేదని, కొనుగోలు కేంద్రం లేక మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రాకపోకలు అంతరాయం కలగగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1