Shuru
Apke Nagar Ki App…
డ్యామ్ లో పడి ఈనాడు రిపోర్టర్ మృతి....ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు కేసు నమోదు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
K.V.REDDY
డ్యామ్ లో పడి ఈనాడు రిపోర్టర్ మృతి....ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు కేసు నమోదు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఈనాడు దినపత్రిక రిపోర్టర్ బొజ్జ రాజ్ కుమార్(34) ప్రమాదవశాత్తు ఎల్ఎండి లోని బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మిత్రుడితో కలిసి డ్యామ్ వద్దకు వెళ్ళగా ప్రమాదవశాత్తు బావిలో జారిపోవడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య పొరండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ కు భార్య సబిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులతోపాటు పలువురు అధికారులు పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
More news from Telangana and nearby areas
- జూమ్ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ ఎం లు, వివిధ విభాగాల హెచ్ఓడి , డీఎం లు.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం.. మంత్రి పొన్నం ప్రభాకర్ RTC అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంధించి సానుకూలంగా ఉండాలి ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలి ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా ఫ్రెండ్లీ గా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలి.. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. మే 17 లోపల మీ మీ డిపోలో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలి 2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చాం ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలి టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు.. సoస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయం.. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి..డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలి ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలు ,ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలి.. ఏదైనా సమస్య మీ స్థాయిలో పరిష్కారం కాక పోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దాం.. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలి.. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దాం పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉందో చూడండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలలాలను సమస్యను పరిష్కరించండి ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళ్దాం..2
- స్టేషన్ ఘన్ పూర్ (మీదికొండ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మీదికొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్య అంశాలు: కుటుంబ సభ్యులపై ఆరోపణలు: తన తండ్రి (కేసీఆర్), సోదరులు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులు: తెలంగాణ ఉద్యమకారులను పక్కనపెట్టి, ఉద్యమ సమయంలో వ్యతిరేకించిన వారికి (తెలంగాణ ద్రోహులకు) పదవులు కట్టబెట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలపై హితవు: తాను కేసీఆర్ విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనను నిత్యం విమర్శించడం మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా, అసలు అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవద్దని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికైనా స్పందించి వివరణ ఇవ్వాలని, పారదర్శకతను నిరూపించుకోవాలని కడియం శ్రీహరి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.1
- ములుగు జిల్లా మల్లంపల్లి ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు దహనం చేసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల రోజులుగా పంటలు కల్లాల్లోనే నిల్వ ఉండిపోయాయని, అధికారులు స్పందించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.1
- తీవ్ర సూర్యరశ్మి కారణంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న ఎలక్ట్రిక్ డీపీ (పెట్టె)లు అధిక వేడిని సంతరించుకుంటున్నాయి. దీనివల్ల ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలను నిలపకుండా, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- *మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు వావిలాల నవీన్ అకాల మృతి పట్ల ఏఐటియుసి నివాళి************ *నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి నవీన్ భార్య కృష్ణవేణికి ఎద విధిగా కొనసాగించాలి****** *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్*** జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వావిలాల నవీన్ మృతికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా ఇచ్చే మట్టి ఖర్చులు తో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు గత సంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కృష్ణవేణి కొనసాగుతున్నదని గత తొమ్మిది నెల క్రితం డెలివరీ అయినందున ఆరోగ్యం బాగాలేక పనిచేయలేక బదిలీ మనిషిని పెట్టడం జరిగిందన్నారు ఆసీ పరిపాలిని ఆమెకు యధావిధిగా కొనసాగించాలని కోరారు ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి చనిపోవడంతో మృతి చెందిన వావిలాల నవీన్ కు ప్రమాద బీమా ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా వెంటనే అందించి ఆదుకోవాలని కోరారు కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం పట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు డ్యూటీకి వచ్చి హాజరి వెయ్యమని అడిగితే వెళ్ళగొట్టడం సరికాదని పరిస్థితుల్లో కార్మికుడు మనోవేదనకు గురి అవుతాడని ఆవేదన వ్యక్తం చేశారు పనిలేని స్థితిలో అయోమయంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుందన్నారు దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే వహించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గంగారాం రాజం రమేష్ రవి నవీన్ తదితరులు పాల్గొని నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు1
- *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్ ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2కే రన్ లో విద్యార్థులు, క్రీడాకారులు పోలీసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు , కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు,ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు.అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాధకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్యార్థులకు , వాహనదారులకు , ప్రజలకు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్ చేయవద్దన్నారు.మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులతో పాటుగా వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.3
- కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ,సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి ,అంజన్న, సత్తన్న ,లింగన్న గారు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.. * ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు: "మన ఊరు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మన మున్సిపల్ కార్మికులే. వారు ఒక రెండు మూడు రోజులు పని చేయకపోయినా మనం ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం గతంలో చూసాము కూడా. కానీ వారు ఎప్పుడూ అలా జరగాలని కోరుకోరు. వారికి ఎన్ని బాధలున్నా ఉదయం 4 గంటలకే ఇంటి నుండి బయలుదేరి 5 గంటలకు అటెండెన్స్ ఇచ్చి, చీకటిలోనే అనేక ప్రమాదాలకు ఎదుర్కొని పనులు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు కావొచ్చు, వీధి కుక్కలు కావొచ్చు.. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు. మన ఇంట్లో ఒక రోజు చెత్త తీయకపోయినా వచ్చే వాసనను మనం భరించలేము. అటువంటిది వారు సమాజంలోని చెత్తనంతా తొలగిస్తూ, అనారోగ్య పాలవుతూ కూడా మనకు సేవ చేస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అని మేము భావిస్తున్నాము. అందుకే గతంలో మా పాలకవర్గం ఉన్న సమయంలో, మనుషులు డ్రైనేజీలలోకి దిగకూడదనే ఉద్దేశంతో అధునాతన మెషినరీని (Suction and Jetting Machines) తీసుకువచ్చాము. దీనివల్ల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చి 'సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్'లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. భారతదేశంలో కరీంనగర్ కు రెండో స్థానం దక్కింది. మున్సిపల్ కార్మికుల కష్టానికి ప్రస్తుతం ఇస్తున్న 16 వేల రూపాయల వేతనం చాలా తక్కువ. దానిని కనీసం 25 వేల రూపాయలకు పెంచాలని నిన్న మే డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చుట్టుపక్కల ఏదైనా పంది లేదా కుక్క చనిపోతే వచ్చే వాసనకే మనం కార్పొరేటర్లకు ఎన్నో సార్లు ఫోన్ చేస్తాము. అటువంటి దుర్వాసనను భరిస్తూ గంటల తరబడి పనిచేసి మనకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇస్తున్న సఫాయి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." "సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంతో ఎండలో కూడా మీరు చేస్తున్న పనిని గుర్తించి, మంచి నీళ్ల సీసా, టవల్ అందించేందుకు ముందుకు వచ్చిన రాజేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా, కార్మికుల ఆరోగ్య బీమా గురించి కూడా నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. గతంలో 60 ఏళ్లు దాటితే మానవత్వం లేకుండా కార్మికులను తొలగించే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన మార్చి, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది ఎదురైనా వారి కుటుంబ సభ్యులకు ఆ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, తగినంత జీతాలు లేవని మాకు తెలుసు. కార్మికుల జీతాలు పెంచేందుకు మా పాలక వర్గం ఖచ్చితంగా కృషి చేస్తుంది. నగరం శుభ్రంగా ఉండటానికి మీరు చేస్తున్న కృషికి నగర ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.1
- వరంగల్: అర్హులైన పేదలకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ శివనగర్లో నిర్వహించిన వరంగల్ తూర్పు సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి 421 మంది లబ్ధిదారులకు రూ. 4.21 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 2,422 మంది చేనేత కార్మికులకు రూ. 78.52 లక్షల ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. అలాగే 248 మంది మైనార్టీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.1