అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
- శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు1
- ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి 15న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ (malaStudent JAC) మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్ను నేడు ఆవిష్కరించారు. ఓయూ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఐక్యత చాటడం రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్ఎస్యూ నుండి ఆర్ఎస్ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి. అభివృద్ధి ప్రణాళికలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాట కార్యాచరణ. మేధో చర్చ మాల జాతి మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యోగుల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని" నిర్వాహకులు పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, అంసా ఓయూ ప్రెసిడెంట్ నామ సైదులు, ప్రొఫెసర్ సవీన్ సౌడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ్, సేపూరి ప్రణయ్, మోహన్ బట్టపోతుల, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్ బత్తుల రమేష్, ఓయూ ప్రెసిడెంట్ దాసరి రవి, అరుణ్ నంద (ఓయూ), బత్తుల దిలీప్, అనీష్ వర్మ, పురమా మహేష్, అంజిబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.1
- రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి, కడక్ పుర, నేతాజీ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన కజూర్ తినిపించి నేటి ఉపవాస దీక్ష విరమింప చేశారు. భారత దేశంలో సర్వ మతాలు సమానమేనని తెలిపారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రేస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు.1
- తెలంగాణ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / – 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద ఉన్న కావేరి వ్యవసాయ కళాశాలలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో సమాజం పట్ల గౌరవం కలిగిన విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అనంతరం మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,టి రాజు అభిమానులు బారీ కేట్ కటింగ్ చేసి,ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ ప్రవీణ్,సామాజిక కార్యకర్త సాదిక్ పాషా,సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సేవకుడు స్వార్థం లేని నాయకుడు,టి వై ఎస్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు అని,నిరుపేదలకు అండగా ఉంటూ,వివిధ ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసి,బుక్స్,పెన్నులు, అందజేస్తూ,గజ్వేల్ పట్టణంలో తన స్వంత భవనంలో అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అండగా నిలుస్తూ,వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న టి రాజు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు4
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామ మహిళా సోదరిమణులందరూ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ మహిళలు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.1