logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెలుగుప్ప మండలం శీర్పి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.

2 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

బెలుగుప్ప మండలం శీర్పి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కర్నూలు జిల్లా.. ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామశివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు... ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు... వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 8 బైకులు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు... ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు...
    3
    కర్నూలు జిల్లా.. ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామశివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు...
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు...
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 8 బైకులు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు...
ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    2
    అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు.
అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం.
ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు.
మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఈనెల 22న రైతు భరోసా డేట్ ఫిక్స్ అని తెలిసింది, ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న రైతులు, ఈ వీడియోను చూడటం ద్వారా రైతు భరోసా లేటెస్ట్ న్యూస్, రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా పథకం, రైతులకు భరోసా కల్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వంటి నాయకులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి, రైతు భరోసా పథకం గురించి మరింత సమాచారం కోసం, మా ఛానెల్ను సబ్ప్రైబ్ చేయండి, మరియు మా వీడియోలను వీక్షించండి. మేము మీకు తెలుగులో ఉత్తమ వ్యవసాయ సమాచారాన్ని అందిస్తాము
    1
    ఈనెల 22న రైతు భరోసా డేట్ ఫిక్స్ అని తెలిసింది, ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న రైతులు, ఈ వీడియోను చూడటం ద్వారా రైతు భరోసా లేటెస్ట్ న్యూస్, రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా పథకం, రైతులకు భరోసా కల్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వంటి నాయకులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి, రైతు భరోసా పథకం గురించి మరింత సమాచారం కోసం, మా ఛానెల్ను సబ్ప్రైబ్ చేయండి, మరియు మా వీడియోలను వీక్షించండి. మేము మీకు తెలుగులో ఉత్తమ వ్యవసాయ సమాచారాన్ని అందిస్తాము
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    1
    పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది,
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు  తెలుగుదేశం పార్టీ నాయకులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది,
వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.
    1
    గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!*
ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా
మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. 
ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 min ago
  • ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాల్సి ఉండంగా. సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్కు రెండు కెనాల్ మాత్రమే ఉన్నాయి. ఒక కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఉన్న ఒక కెనాల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు నీటి అవసరమే ఎక్కువగా ఉందని అధికారులు స్పందించాలని రైతులు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాల్సి ఉండంగా. సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్కు రెండు కెనాల్ మాత్రమే ఉన్నాయి. ఒక కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఉన్న ఒక కెనాల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు నీటి అవసరమే ఎక్కువగా ఉందని అధికారులు స్పందించాలని రైతులు   కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.