*కూటమి ప్రభుత్వం సమానత్వంతో కూడిన సంక్షేమాన్ని అందిస్తోంది* _కొండపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు_ *ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1,(వెలుగునాడు ప్రతినిధి)* సమాజంలో సమానత్వంతో కూడిన జీవనవిధానం ప్రతి ఒక్కరి హక్కు అని,వాటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆ లక్ష్యాన్ని 100% చేరువైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు మైలవరం నియోజకవర్గ సర్ ప్రోగ్రాం పరిశీలకులు చుట్టుకుదురు శ్రీనివాసరావు తెలిపారు.కొండపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వార్షికంగా 32 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులతో "ఎన్టీఆర్ రైతు భరోసా" పథకాన్ని అతిపెద్ద సంక్షేమంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ కేటగిరీల ద్వారా ఆర్థిక చేయూత ఇస్తూ గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాష్ట్రంలో 62 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 2700 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ,99% లబ్ధిదారులకు ప్రభుత్వాధికారుల ద్వారా పింఛన్లు అందజేయడం జరిగిందని వెల్లడించారు.ఎన్టీఆర్ భరోసాతో పాటు దీపం-2.0,తల్లికి వందనం,స్త్రీ శక్తి,అన్నదాత సుఖీభవ,అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి పథకాలతో పేదలకు అండగా ఉంటున్నామని చెప్పారు. కేంద్రంలో మోడీ ఆశీస్సులతో,సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ సమన్వయంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేటట్లు చూస్తూనే,అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని,ఆంధ్ర రాష్ట్ర కల ప్రాజెక్టు పోలవరం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
*కూటమి ప్రభుత్వం సమానత్వంతో కూడిన సంక్షేమాన్ని అందిస్తోంది* _కొండపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు_ *ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1,(వెలుగునాడు ప్రతినిధి)* సమాజంలో సమానత్వంతో కూడిన జీవనవిధానం ప్రతి ఒక్కరి హక్కు అని,వాటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆ లక్ష్యాన్ని 100% చేరువైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు మైలవరం నియోజకవర్గ సర్ ప్రోగ్రాం పరిశీలకులు చుట్టుకుదురు శ్రీనివాసరావు తెలిపారు.కొండపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వార్షికంగా 32 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులతో "ఎన్టీఆర్ రైతు భరోసా" పథకాన్ని అతిపెద్ద సంక్షేమంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ కేటగిరీల ద్వారా ఆర్థిక చేయూత ఇస్తూ గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాష్ట్రంలో 62 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 2700 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ,99% లబ్ధిదారులకు ప్రభుత్వాధికారుల ద్వారా పింఛన్లు అందజేయడం జరిగిందని వెల్లడించారు.ఎన్టీఆర్ భరోసాతో పాటు దీపం-2.0,తల్లికి వందనం,స్త్రీ శక్తి,అన్నదాత సుఖీభవ,అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి పథకాలతో పేదలకు అండగా ఉంటున్నామని చెప్పారు. కేంద్రంలో మోడీ ఆశీస్సులతో,సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ సమన్వయంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేటట్లు చూస్తూనే,అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని,ఆంధ్ర రాష్ట్ర కల ప్రాజెక్టు పోలవరం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
- *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు1
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.1
- 13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం3
- ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.1
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*1